Skip to main content

Posts

Showing posts from August, 2019

జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు రాజకీయ మంతనాలు

జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ మంతనాలు సాగించినట్లుగా తెలుస్తోంది . నందమూరి హరికృష్ణ సంవత్సరీకం సందర్బంగా హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని , నందమూరి కళ్యాణ్ రామ్ ని పరామర్శించాడు . హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం జూనియర్ తో కాసేపు మంతనాలు సాగించాడట . తెలుగుదేశం పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది తెలుగు రాష్ట్రాలలో . తెలంగాణలో అయితే తెలుగుదేశం అడ్రస్ లేకుండాపోయింది , అయితే గుడ్డిలో మెల్ల లాగా ఆంధ్రప్రదేశ్ కాస్త బెటర్ అసెంబ్లీ లో కనీసం 23 మంది ఎం ఎల్ ఏ లున్నారు . పరిస్థితి చూస్తుంటే 23 మంది ఎం ఎల్ ఏ లలో మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికీ 5 మంది లేక 10 మంది మిగిలితే పెద్ద గొప్పే అన్నట్లుగా ఉంది . దాంతో తెలుగుదేశం పార్టీని కాపాడాలంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే అవుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33MUmas

సాహో రికార్డుల మోత మోగించడం ఖాయమా ?

ప్రభాస్ నటించిన సాహో చిత్రం రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది . 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో ఆగస్టు 30 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు , ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు . దాంతో మొదటి రోజున అలాగే వీకెండ్ కలెక్షన్స్ లో రికార్డుల మోత మోగడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో విడుదల అవుతున్న సందర్బంగా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమైపోయింది . ఇక సినిమాకు టాక్ బాగుంటే అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం . ఒకవేళ టాక్ బాగోలేకపోయినా ఓపెనింగ్ డే , వీకెండ్స్ రికార్డ్స్ సాహో వశం అవ్వడం ఖాయం . ఎందుకంటే క్రౌడ్ అంతగా ఉంది మరి ఈ సినిమా కోసం . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Mnchix

మన్మథుడు 2 రివ్యూ

నటీనటులు : అక్కినేని నాగార్జున , రకుల్ ప్రీత్ సింగ్ , వెన్నెల కిషోర్  సంగీతం : చేతన్ భరద్వాజ్ నిర్మాతలు : నాగార్జున , జెమిని కిరణ్ దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ రేటింగ్ : 3 /5 రిలీజ్ డేట్ : 9ఆగస్టు 2019 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సూపర్ హిట్ ఐన విషయం తెలిసిందే . ఇన్నాళ్లకు మళ్ళీ అదే టైటిల్ తో దానికి కొనసాగింపుగా 2 ని చేర్చి నాగార్జున చేసిన ప్రయత్నం మన్మథుడు 2 . అయితే ఇది ఆ సినిమాకు సీక్వెల్ కానప్పటికీ అంచనాలు అయితే బాగానే ఏర్పడ్డాయి ఈ సినిమా మీద . మరి ఆ అంచనాలను నాగ్ అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . కథ : తొలిసారి ప్రేమలో విఫలం కావడంతో ఆగ్రహం చెందిన సామ్ ( అక్కినేని నాగార్జున ) ప్లే బాయ్ లా మారతాడు . కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు . అయితే ఏజ్ బార్ అవుతోంది కాబట్టి త్వరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో పోరు పెడుతుంటారు . ఇంట్లో వాళ్ళ పోరు పడలేక అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ ) తో కలిసి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు . అయితే ఈ క్రమంలో ఎలాంటిసంఘటనలు జరిగాయి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . హైలెట్స్ : నాగార్జ...

ఆర్టికల్ 370 రద్దుని తప్పుపట్టిన రాహుల్ గాంధీ

జమ్మూ కశ్మీర్ పై తొలిసారి పెదవి విప్పారు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ . ఆర్టికల్ రద్దు నిర్ణయం తొందరపాటు చర్య అని , ఈ నిర్ణయం వల్ల మనసులు గెలుచుకోలేమని ట్వీట్ చేసాడు రాహుల్ . మోడీ – షా జోడీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరింత గందరగోళ పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు రాహుల్ . జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . అయితే రాహుల్ మాత్రం తాజాగా స్పందించాడు . ఇక రాహుల్ స్పందన కూడా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తప్పే అని అంటున్నాడు . అయితే ప్రతిపక్షాలు ఎంతగా నోరు నెత్తిలో పెట్టుకున్నా మోడీ – షా మాత్రం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయడం లేదు . కాశ్మీర్ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా కానీ వెనకడుగు వేసేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా . from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31k70Mg

మైత్రితో దోస్తీ… దిల్ రాజుతో వైరం – విజయ్ దేవరకొండ!!

డియర్ కామ్రేడ్ డిజాస్టర్ ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య వైరం పెరుగుతోంది. ఎప్పటినుండో విజయ్ తో సినిమా చెయ్యాలని వెయిట్ చేసున్న దిల్ రాజు కి మళ్లి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి కూడా విజయ్ దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ సాధించిన పూరి జగన్నాద్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చేయనున్నాడు విజయ్. తెలంగాణ నేపథ్యంలో రూపొందన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని టీమ్ భావిస్తోంది. విజయ్ కూడా ఇప్పటికే పూరీని రెండు సార్లు కలిసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, పూరి కనెక్ట్స్ పతాకాలపై నిర్మించనున్నారని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి! విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పూరి జగన్నాద్ from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2M32U7s