సమంతా ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్బాబు సమర్పకుడిగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఓ బేబీ . కొరియన్ హిట్ మూవీ ‘ మిస్ గ్రానీ ’ కి తెలుగు రీమేక్గా వచ్చిన ‘ ఓ బేబీ ’ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది . నాగ శౌర్య ముఖ్య పాత్రలో , లక్ష్మి , రాజేంద్ర ప్రసాద్ , రావు రమేశ్ , కీలక పాత్రల్లో నటించారు . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబడుతోంది . 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారిపోయే కథాంశంతో ‘ ఓ బేబీ ’ తెరకెక్కింది . కాగా ఇప్పుడు ‘ ఓ బేబీ ’ ని బాలీవుడ్లోనూ తెరకెక్కించాలని సురేశ్బాబు భావిస్తున్నారట . ఇందులో సామ్ పాత్రను ఆలియా భట్తో చేయించాలని ప్రయత్నిస్తున్నారట . అయితే ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు . ప్రస్తుతం ‘ ఆర్ . ఆర్ . ఆర్ ’, ‘ బ్రహ్మాస్త్ర ’, ‘ సడక్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు . ఈ నేపథ్యంలో ఆమెతో రీమేక్ తీయడం ఇప్పట్లో సాధ్యంకాదేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి .. ఎలాగైనా...