Skip to main content

Posts

Showing posts from September, 2018

రెమ్యునరేషన్ పెంచలేదంటున్న విజయ్ దేవరకొండ

గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ కాగా ఈ హీరో తనకు వచ్చిన స్టార్ డంతో అమాంతం తన రెమ్యునరేషన్ ని డబుల్ చేశాడని వార్తలు వస్తున్నాయి . ఈ వార్తలు మరింతగా స్ప్రెడ్ కావడంతో కాబోలు విజయ్ దృష్టికి వచ్చాయి దాంతో రెమ్యునరేషన్ విషయం పై స్పందించాడు . నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని , స్టార్ గా ఎడిగానని అనుకోవడం లేదని అందుకే నా రెమ్యునరేషన్ పెంచలేదని చెప్పాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు. చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం ఏకంగా 120 కోట్లకు పైగా వసూల్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ని పది కోట్లకు పెంచాడని వినబడుతోంది కానీ విజయ్ మాత్రం రెమ్యునరేషన్ పెంచలేదని 5 కోట్లు మాత్రమే తీసుకుంటున్నామని పరోక్షంగా చెబుతున్నాడు . నిజమేనా ! నమ్మొచ్చా …… విజయ్ దేవరకొండ మాటలను. English Title: Vijay devarakonda denied rumours from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NRR3KV

అరవింద సమేతలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్11న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కొడుకులు గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది . రాయలసీమ కరువు రక్కసికి , రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలైన తండ్రి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పెనీవిటి అనే పాటని ఎన్టీఆర్ , ఈషా రెబ్బా పైన చిత్రీకరిస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్. గుండెల్ని పిండేసే ఈ పాట అరవింద సమేత లో హైలెట్ అవుతుందని , కన్నీళ్లు పెట్టించే పాట ఇదని అంటున్నారు. ఒకరు తండ్రిగా మరొకరు కొడుకుగా ……. తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వారసుడిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయమని అంటున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ అన్నది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ గా...

గెలుచుకున్న 50 లక్షలను కౌశల్ ఏం చేస్తున్నాడో తెలుసా

బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచిన విషయం తెలిసిందే. నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 లో అనామకుడిగా అడుగుపెట్టిన కౌశల్ రోజు రోజుకి తన స్థాయి పెంచుకుంటూ ఏకంగా కౌశల్ ఆర్మీ తయారయ్యేలా చేసుకున్నాడు. ఎలిమినేషన్ వచ్చిన ప్రతీ సందర్భంలో కౌశల్ ఆర్మీ సహాయంతో భారీ ఎత్తున ఓట్లు కొల్లగొట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ని మాత్రమే కాదు చివరకు బిగ్ బాస్ ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నాడు కౌశల్. ఈ స్థితికి రావడానికి కారణం కౌశల్ ఆర్మీ అండదండలు . ఇక బిగ్ బాస్ 2 లో విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ట్రోఫీతో పాటుగా 50 లక్షల నగదు బహుమతి కూడా లభించింది. ఆ మొత్తాన్ని కౌశల్ ఏం చేస్తున్నాడో తెలుసా…….. క్యాన్సర్ పేషెంట్ ల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట . ఎందుకంటే కౌశల్ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయిందట అందుకే క్యాన్సర్ బాధితుల సహయార్థం 50 లక్షలను వినియోగిస్తానని ప్రకటించాడు కౌశల్. ఇక బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో విన్నర్ ని ప్రకటించడానికి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు . మొత్తానికి నిన్నటితో బిగ్ బాస్ 2 సీజన్ కంప్లీట్ అయ్యింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహ...

ఇంకా 23 కోట్లు రాబట్టే సత్తా ఈ హీరోలకు ఉందా ?

ఈనెల 27న విడుదలైన దేవదాస్ మూడు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 కోట్ల షేర్ సాధించింది, అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ రాబట్టాలి . మరి అంతటి సత్తా అక్కినేని నాగార్జున కు నాని కి ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. మొదటి వారంలో ఎంత ఎక్కువ రాబడితే అంత మంచిది లేదంటే రెండో వారంలో భారీ మొత్తాన్ని రికవరీ చేయడం కష్టమే ! వీకెండ్ ని కాస్త అటు ఇటుగా సద్వినియోగం చేసుకుంది దేవదాస్ చిత్రం . కానీ 35 కోట్ల షేర్ వసూల్ చేయడం కష్టమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి మూడు రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 9 కోట్ల షేర్ వసూల్ చేయగా ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మిగతా మూడు కోట్లు వసూల్ అయ్యాయి. అయితే మొదటి వారం అంతా కలిపి 18 కోట్ల షేర్ వస్తే గొప్పే అంటున్నారు ఎందుకంటే వసూళ్లు నిన్న తగ్గాయి కాకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి మెరుగ్గానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సోమవారం నుండి దేవదాస్ కు అసలైన పరీక్ష మొదలుకానుంది. 35 కోట్ల షేర్ రాకపోతే నిర్మాతకు పోయేది ఏమీలేదు కానీ బయ్యర్లకు మాత్రం నష్టం తప్పదు. English Title: Will devadas collect 23 crores from box-office ...

కేసీఆర్ కు చుక్కలు చూపిస్తానంటున్న కొండా సురేఖ

వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎం ఎల్ ఏ కొండా సురేఖ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో టీఆర్ఎస్ గెలవకుండా ముప్పుతిప్పలు పెడతానని ముఖ్యంగా వర్ధన్నపేట , పాలకుర్తి , వరంగల్ ఈస్ట్ లతో పాటుగా పరకాల , భూపాలపల్లి లలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తానని తద్వారా కేసీఆర్ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తానని శపథం చేస్తోంది కొండా సురేఖ. వరంగల్ ఈస్ట్ ఎం ఎల్ ఏ గా టీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహించింది కొండా సురేఖ కానీ తాజాగా మాత్రం ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించడంతో కేసీఆర్ ,కేటీఆర్ లపై నిప్పులు చేరుగుతూ రచ్చ రచ్చ చేసింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ దంపతులు ఈసారి కేసీఆర్ ని టార్గెట్ చేశారు. అధికార మదంతో కేసీఆర్ కు కేటీఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయని వాటిని కిందకు దించుతామని సవాల్ చేస్తోంది కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి బలం ఉంది దాంతో ప్రతీ నియోజకవర్గ పరిధిలో ఎంత వీలైతే అంత వ్యతిరేక ప్రచారం చేయాలని కసిగా ఉన్నారు కొండా దంపతులు. కొండా సురేఖ వల్ల టీ...

మనికర్ణిక టీజర్ రెడీ మరి క్రిష్ పేరు ఉంటుందా

వీరనారి ఝాన్సీ రాణి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం మనికర్ణిక. వివాదాస్పద భామ కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. దాదాపు 80 శాతానికి పైగా క్రిష్ డైరెక్షన్ లోనే తెరకెక్కింది మనికర్ణిక అయితే క్రిష్ కు కంగనా రనౌత్ కు షూటింగ్ లో మనస్పర్థలు రావడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు క్రిష్ . దాంతో బ్యాలెన్స్ ఉన్న టాకీ పార్ట్ కు కంగనా దర్శకత్వం వహించింది. ఇంకేముంది పెద్ద రచ్చ అయ్యింది ఈ విషయం . కట్ చేస్తే ఈ సినిమాకు డైరెక్టర్ నేను కాదు క్రిష్ మాత్రమే అని కవరింగ్ ఇచ్చింది కంగనా . ఇక ఇప్పుడేమో గాంధీ జయంతి ని పురస్కరించుకుని అక్టోబర్2న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అంటే తప్పకుండా దర్శకుడి పేరు ఉండాలి టైటిల్స్ లో . మరి రేపు సాయంత్రం విడుదల అయ్యే ట్రైలర్ లో క్రిష్ పేరు ఉంటుందా ? కంగనా పేరు ఉంటుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. కంగనా రనౌత్ క్రిష్ ని అవమానించడం వల్ల ఆమెతో గొడవపడి ప్రయోజనం లేదని మనికర్ణిక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు , అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్...

మహేష్ బావ ఆ సినిమా ఎందుకు రిజెక్ట్ చేసాడంటే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు ఇటీవలే నన్ను దోచుకుందువటే చిత్రంతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా విజయం సాధించాడు అయితే పూర్తిస్థాయి విజయం కాకపోయినా ప్లాప్ కాలేదు పైగా హిట్ టాక్ కూడా వచ్చిన చిత్రం కాబట్టి సుధీర్ బాబు హీరోగా నిర్మాతగా రెండు విధాలుగా సక్సెస్ కొట్టునట్లే ! నన్ను దోచుకుందువటే సక్సెస్ తో సంతోషంగా ఉన్న సుధీర్ కు బాలీవుడ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో విలన్ గా నటించమని సుధీర్ ని కోరారట అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు సుధీర్ బాబు . పెద్ద బ్యానర్ , పైగా మల్టీస్టారర్ చిత్రం అందునా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్న చిత్రం అయినప్పటికీ సుధీర్ బాబు విలన్ గా నటించడానికి ఒప్పుకోలేదు. ఇంతకుముందు భాగీ చిత్రంలో విలన్ గా నటించాడు కూడా కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడో తెలుసా …….. పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం వల్లే ! బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించాలని ఎప్పుడో డిసై...

పాపం ! విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ టైం బాగుందని అనుకుంటున్న సమయంలో టాక్సీ వాలా సినిమా మొత్తం లీకై హల్చల్ చేస్తోంది. గీత గోవిందం సినిమాతో పాటుగా టాక్సీ వాలా కూడా లీకైంది . గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే లీక్ కాగా టాక్సీ వాలా మాత్రం మొత్తం సినిమా లీకైంది. అయితే సినిమా మొత్తం రీ రికార్డింగ్ పూర్తిచేసుకున్న సినిమా మాత్రం కాదు. మొత్తం నాలుగు గంటల సినిమానట లీకైంది. ఇంకేముంది టాక్సీ వాలా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురి దగ్గర ఈ సినిమా చేరిపోయింది. మొబైల్ ఫోన్ లలో ఆ సినిమాని చూసుకుంటున్నారట . అసలే విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇలా టాక్సీ వాలా మొత్తం పైరసి బారిన పడటంతో పాటుగా గ్రాఫిక్స్ కారణంగా నాలుగు నెలలుగా విడుదలకు నోచుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ ఏకంగా నాలుగు నెలలు పూర్తయ్యాయి , ఐదో నెల లో అడుగుపెట్టింది . ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదా ? అన్న అనుమానం నెలకొంది. ఇటీవలే గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నోటా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. English Title: Vijay devarakonda taxiwala leaked from టాప్ స్టోరీస్ –...

రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించే దమ్ము లేదా

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సిట్టింగ్ జడ్జి తో విచారణకు నేను సిద్ధం , నా ఆస్తులు అలాగే నీ ఆస్తుల గురించి విచారణ చేయిద్దామా ? విచారణలో నేను అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లైతే కమిషనే తేల్చుతుంది ఎవరు అక్రమ ఆస్తులు కూడబెట్టారనేది అంటూ నిన్న కేసీఆర్ కు సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ సవాల్ విసిరగా దానికి బదులుగా టీఆర్ఎస్ శ్రేణులు , నాయకులు పెద్ద ఎత్తున రేవంత్ పై విరుచుకు పడ్డారు కానీ సవాల్ ని మాత్రం స్వీకరించలేదు . రేవంత్ పై అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అయతే ఆ ఆరోపణలు నిరూపించడానికి రేవంత్ చెపినట్లు సిట్టింగ్ జడ్జీ తో విచారణ చేయిస్తే సరిపోతుంది కానీ రేవంత్ సవాల్ ని పట్టించుకోకుండా ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. రేవంత్ అంటే చాలు నిలువెల్లా ఊగిపోతున్నారు టీఆర్ఎస్ నాయకులు. కొడంగల్ లో రేవంత్ ని ఓడించాలని కసిగా ఉన్నారు కేసీఆర్ అండ్ కో. మరి రేవంత్ రెడ్డి ని ఓడించడం వీళ్ళ వల్ల అవుతుందా ? కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు. English Title: Revanth reddy challenges to kcr ...

విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు

విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాల పుణ్యమా అని ఎక్కడాలేని క్రేజ్ విజయ్ దేవరకొండ వశం అయ్యింది. అందుకు ఉదాహరణే తమిళ బిగ్ బాస్ . లెజెండ్ కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ షో పూర్తి అవుతున్న సందర్భంగా గెస్ట్ గా విజయ్ దేవరకొండ ని ఆహ్వానించారు. కమల్ నిర్వహిస్తున్న షోకి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ హాజరు కావడం అంటే మాటలు కాదు , గొప్ప అవకాశం అనే చెప్పాలి. తాజాగా ఈ హీరో తమిళంలో నటించిన చిత్రం నోటా. ఆ చిత్రం అక్టోబర్ 5న విడుదల అవుతోంది దాంతో బిగ్ బాస్ 2 హౌజ్లోకి వెళ్లినట్లు ఉంటుంది తన సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడుతుంది కూడా అని భావించి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విజయ్ నోటా తో నేరుగా పలకరించబోతున్నాడు. ఇక ఈ హీరోని తమిళ ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటారా ? లేదా ? అన్నది మరో ఐదు రోజుల్లోనే తేలిపోనుంది. తెలుగు , తమిళ రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగిలిన ఈ సమయంలో నోటా రిలీజ్ కావడం అంటే అదృష్టమే ! English Title: Vijay devarakonda meets kamal hassa...

బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరో తెలుసా

బిగ్ బాస్ 2 తుది దశకు చేరుకుంది దాంతో బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరు ? అన్న ఉత్సుకత నెలకొంది అందరిలో. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ విన్నర్ కౌశల్ అని తెలుస్తోంది. అయితే కౌశల్ విన్నర్ అని తెలుస్తున్నప్పటికి అధికారికంగా తెలిసే వరకు మాత్రం సస్పెన్స్ అనే చెప్పాలి. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అయినట్లు గా కొన్ని ఫోటోలు లీక్ కావడంతో అదే నిజమని తెలుస్తోంది అలాగే కౌశల్ కు భారీ ఎత్తున ఓట్లు వచ్చి పడుతున్నాయి దాని వెనుక కౌశల్ ఆర్మీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కౌశల్ ఆర్మీ గతకొద్ది రోజులుగా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యింది. అసలు ఒకదశలో బిగ్ బాస్ నే శాసించే స్థాయికి చేరుకుంది కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ తో పాటుగా తనీష్ , గీతా మాధురి, దీప్తి , సామ్రాట్ లున్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విన్నర్ అన్నది అధికారికంగా తేలాల్సి ఉన్నప్పటికీ కౌశల్ విన్నర్ అని మాత్రం లీకులు అందుతున్నాయి. 112 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ 2 కి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. English Title: Is kaushal Bigg boss 2 winner from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2IqfKbx...

ఇంత బూతా ! ఆ వెబ్ సిరీస్ లో

పేరుకి వెబ్ సిరీస్ అయినప్పటికీ పోర్న్ మూవీ ని తలదన్నేలా ఉంది XXX అన్ సెన్సార్డ్ వెబ్ సిరీస్ . మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ అడల్ట్ వెబ్ సిరీస్ ని నిర్మించడం విశేషం. ఇప్పటికే పలు టీజర్ లతో ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లతో ప్రకంపనలు సృష్టించగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రారంభమై మరింత సంచలనం సృష్టిస్తోంది. పోర్న్ సినిమాకు ఏమాత్రం తక్కువ తినకుండా ఉంది ర్ వెబ్ సిరీస్ . పచ్చిగా శృంగార సన్నివేశాలు ఉన్నాయి దాంతో యువత తో పాటుగా కాస్త ఏజ్ మీద పడిన వాళ్లని కూడా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు. శృంగార సన్నివేశాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించారు అందాల ముద్దుగుమ్మలు. క్రేజ్ కోసం ,డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఈ భామలు. మొత్తానికి ఏక్తా కపూర్ మహిళ అయినప్పటికీ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని అడల్ట్ సినిమాలను రూపొందిస్తూ సొమ్ము చేసుకున్న ఈ భామ తాజాగా వెబ్ సిరీస్ తో కూడా పిచ్చెక్కించేస్తోంది. English Title: XXX uncensored sensation from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2P0hSt1

నవాబ్ సినిమాని రిజెక్ట్ చేసిన చరణ్

దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది , అతడి సినిమాలో చిన్న వేషం దొరికినా చాలు అని కోరుకుంటారు కానీ అది ఒకప్పుడు ఎందుకంటే మణిరత్నం ఒకప్పుడు దక్షిణాదిన మాత్రమే కాకుండా యావత్ భారతంలో కూడా గొప్ప దర్శకుడు గా పేరు పొందారు అలాగే సక్సెస్ కూడా ఉంది కాని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది . మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో అతడి సినిమాలో నటించడానికి కొంతమంది స్టార్స్ భయపడుతున్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ కూడా ఒకరు. నవాబ్ సినిమాని రిజెక్ట్ చేసాడు చరణ్ . వరుస పరాజయాల నేపథ్యంలో కసితో నవాబ్ కథ ని రాసుకున్న మణిరత్నం నవాబ్ చిత్రంలో శింబు నటించిన పాత్రలో రాంచరణ్ చేత చేయించాలని భావించి తన సతీమణి సుహాసిని ని తీసుకుని మరీ వచ్చాడు హైదరాబాద్. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ నవాబ్ కథ చెప్పాడట ! అయితే కథ విని , శింబు పాత్ర లో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో ప్రేక్షకులు , అందునా మెగా ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సున్నితంగా తిరస్కరించాడట . కట్ చేస్తే నవాబ్ సినిమా విడుదల అయ్యింది . తెలుగులో ...

కేసీఆర్ అంతు చూస్తానంటున్న రేవంత్ , సంపత్

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతు చూస్తామని ప్రతిన బూనారు కాంగ్రెస్ తాజా మాజీ ఎం ఎల్ ఏ లు రేవంత్ రెడ్డి , సంపత్ లు. వేరు వేరుగా ఈ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసహనంతో ఊగిపోతున్నాడని , వచ్చే ఎన్నికల్లో ఒడిపోతాననే భయం పట్టుకుందని అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పడుతున్నారని అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేసారు రేవంత్ రెడ్డి , సంపత్ లు. శాసనసభలో స్పీకర్ పై దాడి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా సంపత్ ల శాసన సభ్యత్వంని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో సంపత్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటే మొదటి నుండి కెసిఆర్ అండ్ కో కు పడటం లేదు దాంతో అతడ్ని ఎలాగైనా సరే జైలుకి పంపాలని చూసినప్పటికి రేవంత్ మాత్రం వెన్ను చూపకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా రేవంత్ ఇంట్లో ఐటీ అధికారులతో పాటుగా ఈడీ అధికారులు కూడా రైడ్ చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో రేవంత్ కూడా చాలా కసిగా ఉన్నాడు...

పందెం కోడి కోసం ఎన్టీఆర్ చరణ్ పోటీ పడ్డారట

2005 లో తెలుగులో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం పందెం కోడి . తమిళంలో పందెం కోడి ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమాతో పరిచయమైన విశాల్ తెలుగులో కూడా సంచలన విజయం అందుకున్నాడు. అయితే తమిళ్ లో పందెం కోడి సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ఎన్టీఆర్ , రాంచరణ్ లు పోటీ పడ్డారట . ఎన్టీఆర్ , చరణ్ లు రీమేక్ హక్కుల కోసం పోటీపడినప్పటికి విశాల్ తండ్రి మాత్రం ఆ హక్కులను ఇవ్వడానికి నిరాకరించాడట . ఇంతకీ తెలుగు హక్కులు ఎన్టీఆర్ , చరణ్ లకు ఇవ్వలేదో తెలుసా ……. విశాల్ తెలుగు కుర్రాడు కావడమే కారణం. విశాల్ తెలుగు వాడు అయినప్పటికీ చెన్నై లో పెరగడం వల్ల తమిళ్ చిత్రాల్లో నటించాడు. అయితే పందెం కోడి హిట్ కావడంతో తెలుగులో ఈ చిత్ర హక్కులు ఎవ్వరికీ ఇవ్వకుండా రీమేక్ లేదా డబ్ చేయాలని అనుకున్నాడట విశాల్ తండ్రి . అయితే రీమేక్ సరిగా రాకపోతే ఎలా ? అని డబ్ చేసాడు కట్ చేస్తే పందెం కోడి సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు పందెం కోడి 2 వస్తోంది. అక్టోబర్ 18న పందెం కోడి రిలీజ్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా విశాల్ కు 25వ సినిమా కావడం. English Title: NTR Ram Charan tried to remake Pa...

టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బాబుమోహన్

తెలంగాణ రాష్ట్ర సమితి కి , కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు తాజా మాజీ శాసనసభ్యుడు , సినీ నటుడు బాబుమోహన్ . ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు బాబుమోహన్. తెలుగుదేశం పార్టీకి చెందిన బాబుమోహన్ గత ఎన్నికల సమయంలో కెసిఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరాడు . ఆందోల్ శాసనసభ నియోజకవర్గ ఎం ఎల్ ఏ గా గెలిచాడు , అయితే ఆ సమయంలో మంత్రి పదవి వస్తుందని భావించాడు కానీ పదవి దక్కలేదు దాంతో మిన్నకుండి పోయాడు కానీ ఈసారి ఏకంగా టికెట్ నిరాకరించడంతో షాక్ తిన్న బాబుమోహన్ తనకు టికెట్ కేటాయించకపోవడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు దాంతో కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీలో చేరాడు. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున బాబుమోహన్ ఆందోల్ నుండి పోటీ చేయనున్నాడు . ఆమేరకు భారతీయ జనతా పార్టీ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. బాబుమోహన్ సినీ నటుడు కావడంతో తమకు లాభిస్తుందని భావిస్తున్నారు భాజపా నాయకులు. మొత్తానికి బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల ఆందోల్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి రావడం ఖాయం . English Title:...

సినిమా రంగంలో ఇదొక సరికొత్త సంచలనం – నటి శోభన

కింగ్ నాగార్జున పరిచయ చిత్రం ‘విక్రమ్’ మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు. ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ ‘టి.ఫైబర్’తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్ ఏర్పాటు చేస్తున్న “జాదూజ్ సెంటర్” పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాదూజ్ సహ వ్యవస్థాపకురాలు శోభన, తెలంగాణ ఐటి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, జాదూజ్ ఫౌండర్ సీఈవో రాహుల్ నెహ్రా, జాదూజ్ రీజనల్ పార్టనర్, రిక్లయినర్ సీఇవో, ప్రముఖ నటుడు లోహిత్, జాదూజ్ రిక్లయినర్ బ్రాండ్ అంబాసిడర్, నటుడు శ్రీధర్ రావు పాల్గొన్నారు. ఇటీవలకాలంలో సామాన్యులకు దూరమై పోయిన సినిమాను వారికి మళ్లీ చేరువ చేయాలనే వజ్ర సంకల్పంతో టి.ఫైబర్ తో కలిసి జాదూజ్ పని చేయనున్నదని ఈ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు.. గ్రామీణులకు విజ్ఞానాన్ని సైతం అందివ్వనున్నామని లోహిత్ అన్నారు. రెండు తెలుగు ర...

సెటైర్ వేసిన విజయ్ దేవరకొండ

తమిళనాడు సెన్సార్ సభ్యులు మా నోటా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారని మరి మన తెలుగు సెన్సార్ సభ్యులు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో అని సెటైర్లు వేసాడు హీరో విజయ్ దేవరకొండ . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం. అక్టోబర్ 5 న సినిమా విడుదలకు సిద్ధం అవుతుండటంతో తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయతే ఏ సర్టిఫికెట్ ఇస్తారో ? యు బై ఏ ఇస్తారేమో అని భయపడితే యు సర్టిఫికెట్ ఇచ్చారట తమిళ సెన్సార్ సభ్యులు దాంతో తెలుగువాళ్లు ఏ సర్టిఫికెట్ ఇస్తారేమో అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ట్వీట్ చేసి ఆసక్తిని పెంచాడు విజయ్ దేవరకొండ. మరి మన తెలుగు సెన్సార్ బోర్డ్ ఎటువంటి కట్స్ చెబుతుందో ? ఏ సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలి. English Title: Vijay Devarakonda satire on Telugu Censor Board We go U Even I voted A. Let’s see what my favourite Telugu Censorboard will give me 🤔 #MaranaWaiting https://t.co/TBDNMnfo2a — Vijay Deverakonda (...

దేవదాస్ కాపీ అని తేలిపోయింది

మలయాళంలో 2015 లో వచ్చిన భార్గవచరితం మూనమ్ ఖండమ్ అనే చిత్రానికి కాపీ ఈ తెలుగు దేవదాస్ . పక్కాగా దొరికిపోయారు దేవదాస్ చిత్ర దర్శక నిర్మాతలు. అయితే రిలీజ్ కి ముందే దేవదాస్ చిత్రం కాపీ అని వార్తలు వచ్చాయి కానీ దర్శక నిర్మాతలు మాత్రం మా సినిమా కాపీ కాదని గుండమ్మ కథ లాంటి గొప్ప సినిమా అన్నట్లు పెద్ద బిల్డప్ కొట్టారు. కాపీ అంటూ కథనాలు వచ్చినప్పటికీ ఒరిజినల్ స్టోరీ అని రిలీజ్ కి ముందు కూడా అన్నారు . కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది మలయాళంలో 2015 లో వచ్చిన భార్గవచరితం -మూనమ్ ఖండమ్ సినిమా అని తేలిపోయింది. మలయాళంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి డాన్ గా నటించగా శ్రీనివాసన్ డాక్టర్ గా నటించాడు. హాస్యంతో తెరకెక్కిన ఆ చిత్రం మలయాళంలో ప్లాప్ అయ్యింది . కట్ చేస్తే ఇక్కడ డాన్ గా నాగార్జున డాక్టర్ గా నాని నటించారు. కాకపోతే కాస్త హీరోయిజం కోసం ఫైట్స్ , గట్రా పెట్టారు అంతే తేడా ! మలయాళంలో ప్లాప్ అయినట్లుగానే తెలుగులో కూడా దేవదాస్ ప్లాప్ దిశగానే దూసుకుపోతోంది. అయితే మమ్ముట్టి తమ చిత్రం కాపీ అని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ మాత్రం కాపీ అని ఒప్పుకోవడం లేదే ! from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu ...

అరవింద సమేత ట్రైలర్ రెడీ

అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆ వేడుకలో ట్రైలర్ ని విడుదల చేయనున్నారు అరవింద సమేత చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా , జగపతిబాబు , నాగబాబు , సునీల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు మరోసారి ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతోందో రుచి చూపించనున్నారట . ఈ వేడుకకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా నందమూరి బాలకృష్ణ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎత్తున నందమూరి అభిమానులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు . ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఉత్సుకతతో ఉన్నారు. తమన్ అందించిన సంగీతం పై విమర్శలు వచ్చినప్పటికీ ఓ రెండు పాటలు అయితే ఆకట్టుకుంటున్నాయి . ఇక ఒక...

మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న భామ

ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసాక భర్తతో వచ్చిన విబేధాలతో అతడికి విడాకులు ఇచ్చిన బ్లాక్ బ్యూటీ అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి , విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా విడాకులు ఇచ్చిన తర్వాత రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇస్తోంది ఈ భామ . అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా నైనా నటించడానికి నాకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించి మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోతతో ఫోటో షూట్ చేయగా తాజాగా మరో హాట్ ఫోటో షూట్ చేసి మరింత షాక్ ఇచ్చింది అమలాపాల్. పెళ్లికి ముందు అందాల ఆరబోతలో కాస్త నియమాలను పెట్టుకుంది కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయింది. ఇక తాజాగా అమలాపాల్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేస్తోంది. అంతేనా మళ్లీ నేను రెండో పెళ్లి చేసుకుంటానని , అలాగే రాజకీయాల్లోకి కూడ వస్తానని కూడా అంటోంది . అయితే రాజకీయాలలోకి రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని అంటోంది. ఇక రెండో పెళ్లి కూడా ఇప్పుడే కాదని ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉందని , క్యా...

ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ మెప్పిస్తాడా

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా చిత్రం అక్టోబర్ 5న భారీ ఎత్తున తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. మొదట ఈ చిత్రాన్ని తమిళంలోనే నిర్మించినప్పటికి విజయ్ దేవరకొండ తెలుగు హీరో కావడంతో పాటుగా అనూహ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో క్రేజ్ రావడంతో తెలుగు చిత్రం అంటూ కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు అంతేకాదు తెలుగులో కొంత షూట్ చేశారు కూడా. ముఖ్యమంత్రి గా వెండితెరపై పలువురు హీరోలు మెప్పించారు. విజయాలు అందుకున్నారు . మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో ఇటీవల ముఖ్యమంత్రి గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా నోటా లో నటిస్తున్నాడు . మరి విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా ప్రేక్షకులను అలరిస్తాడా ? లేదా ? అన్నది అక్టోబర్ 5 న తేలనుంది. విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి గా నటించగా మెహరీన్ జర్నలిస్ట్ గా నటించింది. సత్యరాజ్ , నాజర్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్యాడ్ బాయ్ గా ఉన్న యువకుడు ముఖ్యమంత్రి గా అధికారం చేపడితే దాన...

దేవదాస్ 35 కోట్లు రాబట్టగలరా

అక్కినేని నాగార్జున , నాని కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ ఈనెల 27న విడుదలైన విషయం తెలిసిందే. మొదటిరోజున దేవదాస్ ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ ని 7 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. నాగార్జున కెరీర్ పరంగా చూసిన నాని కెరీర్ పరంగా చూసిన బెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరూ సోలోగా నటించిన చిత్రాలకు 6 లేదా 7 కోట్ల గ్రాస్ కి మించి రాలేదు అయితే ఇద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . అయితే ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు లాభాలను పొందాలంటే 35 కోట్ల షేర్ రాబట్టాలి . మరి అంత సొమ్ము రాబట్టే దమ్ము ఈ దేవదాస్ కు ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. మొదటి రోజున వచ్చింది కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే అంటే ఇంకా 28 కోట్ల షేర్ రావాలి. సినిమాకు పాజిటివ్ టాక్ అంతగా లేదు కాబట్టి ఈరోజు , రేవు వచ్చే కలెక్షన్స్ మాత్రమే భారీ స్థాయిలో వస్తాయి . సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం . దానికి తోడు అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అవుతోంది కాబట్టి దేవదాస్ కు కష్టకాలం వచ్చినట్లే ! అంటే విజయ్ దేవరకొండ సినిమా వచ్చాక దేవదాస్ ని పట్ట...

సువర్ణసుందరి నుంచి “సాహో సార్వ భౌమి” సాంగ్ విడుదల

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి”. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలొని “సాహో సార్వభౌమి” పాటను ఈ రోజు విడుదల చెశారు‌. ఈ సందర్బంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ.. సువర్ణసుందరి ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ . దర్శకుడు సూర్య ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నా కెరీర్ లొ ఓ అత్యుత్తమ చిత్రం గా నిలిచి పొనుంది. ఈ సినిమా లొని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి.నాకు పర్సనల్ గా ఇష్టమైన “సాహొ సార్వభౌమి” పాట ఈ రొజు విడుదల చెస్తున్నారు. మ్యూజికల్ గా, విజువల్ గా ఉత్తమంగా వచ్చిన ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇం...

విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా పరిచయమయ్యేది ఆరోజే

హీరోగా సంచలనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని కూడా హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేసాడు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే , కాగా ఇప్పుడు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది. ఆనంద్ విజయ్ దేవరకొండ , శివాత్మిక జంటగా మహేంద్ర దర్శకత్వంలో సినిమా రానున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా మాత్రం డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ విజయ్ దేవరకొండ తమ్ముడి కొత్త సినిమా ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలుసా……. అక్టోబర్ 10. అవును అక్టోబర్ 10న ఈకొత్త సినిమా ప్రారంభం కానుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో మహేంద్ర దర్శకుడిగా మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తో పాటుగా పెద్ద కూతురు శివాని కూడా హీరోయిన్ లు కావడంతో ఆ హీరో ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడటం ఖాయమని అంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన రాజశేఖర్ కాలక్రమంలో రేసులో లేకుండాపోయాడు దాంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ...

నోటా చిత్రంలో ఏ హీరో నటించాలో తెలుసా

నోటా చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు కానీ అసలు ఈ సినిమా ఎవరు చేయాలో తెలుసా ? ఎందుకు వద్దన్నాడో తెలుసా ? …….. ఈ సినిమాలో హీరోగా నటించాల్సింది అల్లు అర్జున్ . అవును అల్లు అర్జున్ దగ్గరకు నోటా కథ తీసుకొని వెళ్ళాడు దర్శకుడు ఆనంద్ శంకర్ , అయితే కథ విన్న తరువాత నా ఇమేజ్ కు ఈ కథ సరిపోదు , నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పాడట దాంతో చేసేదిలేక విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పాడట . రాజకీయ నేపథ్యంలో సాగే కథ కావడంతో బాగా నచ్చిందట ఇంకేముంది వెంటనే ఓకే చెప్పాడు కట్ చేస్తే అక్టోబర్ 5న విడుదల అవుతోంది. గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దాంతో నోటా చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ నటించగా జర్నలిస్ట్ గా హాట్ భామ మెహరీన్ నటించింది. ఒకవేళ నోటా పెద్ద హిట్ అయితే అల్లు అర్జున్ తప్పు చేసినట్లే ! అలాగే నోటా ప్లాప్ అయితే ఓ ప్లాప్ నుండి తప్పించుకున్నట్లే ! అయితే అల్లు అర్జున్ చేసింది తప...

ఐరన్ లెగ్ మచ్చ పోతుందా ఈ భామకు

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇప్పటి వరకు ఈ భామ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ లు , డిజాస్టర్ లు అయ్యాయి మరి అయితే ఒక్క రంగస్థలం చిత్రం మాత్రం మినహాయింపు. రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మాత్రమే చేసింది కాబట్టి ఆ సినిమా లెక్కలేదు ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే …… ముకుంద , సాక్ష్యం , దువ్వాడ జగన్నాథం , చిత్రాలు ప్లాప్ అయ్యాయి అలాగే హిందీలో హృతిక్ రోషన్ సరసన నటించిన మొహంజదారో చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో ఈ భామ కు ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పటికి ఈ భామకు మాత్రం ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటించింది . ఇక ఈ సినిమా అక్టోబర్ 11న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే పూజా హెగ్డే కు ఇప్పటి వరకు హిట్ లేదు పైగా ఐరన్ లెగ్ ముద్ర ఉంది దాంతో ఎన్టీఆర్ కు కూడా ఐరన్ లెగ్ ముద్ర అంటుకుంటుందా ? లేక హిట్ ఇచ్చి పూజా హెగ్డే ని గోల్డెన్ లెగ్ గా మారుస్తాడా చూడాలి. ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా మహేష్ బాబు సరసన మహర్షి చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ ...

ఎన్టీఆర్ ,విజయ్ దేవరకొండ లలో గెలిచేదెవరు?

అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అవుతుండగా అక్టోబర్11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది అంటే ఆరు రోజుల వ్యవధిలో ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ పోటీపడుతున్నారన్నమాట . నిస్సందేహంగా ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరో అందునా మాస్ హీరో అయినప్పటికీ విజయ్ దేవరకొండ ని తక్కువగా అంచనా వేయలేం ఎందుకంటే కేవలం ఐదేళ్ల కాలంలోనే సత్తా చాటాడు అందునా రెండేళ్ల కాలంలోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ లు మూడు అందుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం ఈ మూడు చిత్రాలు మూడు రకాలుగా తెరకెక్కాయి కానీ సంచలనాల విషయంలో మాత్రం ఒకే పోలిక ఉంది ఈ మూడు చిత్రాలకు. సడెన్ స్టార్ అయిపోయాడు ఈ మూడు చిత్రాలతో విజయ్ దేవరకొండ . ఎన్టీఆర్ నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ దుమ్ము దులిపాడు . బ్లాక్ బస్టర్ లను అందుకున్న ఎన్టీఆర్ ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ లలో నెంబర్ 3 గా రాణిస్తున్నాడు. ఇప్పటికే వరుస హిట్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న ఎన్టీఆర్ కు తాజాగా త్రివిక్రమ్ తోడయ్యాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్...

నానిపై పగ తీర్చుకున్న కౌశల్ ఆర్మీ

నాని , నాగార్జున కలిసి నటించిన దేవదాస్ చిత్రాన్ని ప్లాప్ చేస్తామని ప్రతిన బూనిన కౌశల్ ఆర్మీ ఎట్టకేలకు నానిపై పగ తీర్చుకుంది. దేవదాస్ చిత్రం విడుదల అవడమే ఆలస్యం బాగోలేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దాంతో నిన్నటి రోజున వసూళ్లు తగ్గాయి. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది , దాంతో క్షణాల్లో దేవదాస్ చిత్రం ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. దేవదాస్ చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి , ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం కౌశల్ ఆర్మీ కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు నాని . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించాడు. నిన్న భారీ ఎత్తున విడుదలైన దేవదాస్ చిత్రానికి రివ్యూస్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు దాంతో దేవదాస్ బృందం నిరుత్సాహంగా ఉంది. నాని పై పగబట్టడానికి కౌశల్ ఆర్మీ కి బలమైన కారణమే ఉంది. నటుడు , మోడల్ అయిన కౌశల్ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక నాని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ 2 హౌజ్ లో మొదటి నుండి కూడా కౌశల్ కు నాని సపోర్ట్ చేయలేదు ,పైగా కొన్ని సందర్భాల్లో కౌ...

మిడిల్ ఫింగర్ చూపెట్టి షాక్ ఇచ్చిన సమంత

పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు , నాకు అనవసరమైన సలహాలు ఇస్తున్న వాళ్లందరికీ ఇదే నా సమాధానం అంటూ మిడిల్ ఫింగర్ చూపెడుతున్న ఇమేజ్ ఒకదాన్ని పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది సమంత. తాజాగా ఈ భామ తన భర్త నాగచైతన్య తోకలిసి పబ్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది , దాని తర్వాత స్పెయిన్ లో నాగచైతన్య తో కలిసి ఉన్న చిన్న చిన్న పీలికల్లాంటి బట్టలను వేసుకొని ఫోటోలకు ఫోజివ్వడమే కాకుండా వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున సమంతపై విమర్శలు చేసారు. ఈ విమర్శల జడివాన ఎలా ఉందంటే సమంత భరించలేనంతగా ఉంది దాంతో చిర్రెత్తుకొచ్చి మిడిల్ ఫింగర్ ఉన్న ఇమేజ్ ని పోస్ట్ చేసి ఘోరంగా అవమానించింది. కొంతమంది నెటిజన్లు తీవ్రంగా సమంతని విమర్శించారు అయితే సమంత మాత్రం తక్కువ తినలేదు , పెళ్లి చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది కాబట్టి ఆ ఇంటి పరువు కాపాడమని , బాధ్యతగా వ్యవహరించమని ……మనది భారతీయ సంస్కృతి అని దాన్ని గుర్తు చేసుకోమని చెబుతున్నారు అంతే ! ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని ఇతరులు సమంతని డిమాండ్ చేయలేరు కానీ అక్కినేని కోడలు అనే ట్యాగ్ ఉంది కాబట్టి...

విజయ్ దేవరకొండ నోటాపై భారీ అంచనాలు

నిన్న విడుదలైన దేవదాస్ చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నోటా చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందిన ఈ నోటా చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. గీత గోవిందం చిత్రం ప్రభంజనం సృష్టించడంతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగింది. గీత గోవిందం చిత్రం కేవలం 12 కోట్ల బడ్జెట్ తో రూపొందింది కానీ వసూళ్ల పరంగా సునామీ సృష్టించి 120 కోట్ల పైచిలుకు వసూల్ చేసింది. దాంతో నోటా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ ఎత్తున బిజినెస్ జరిగింది. నోటా చిత్రం కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం . కానీ రెండు బాషలలో విడుదల అవుతుండటంతో నిర్మాతకు మాత్రం ఇప్పుడే భారీ లాభాలు వచ్చాయి. ఇక బయ్యర్లకు భారీ లాభాలు రావాలంటే నోటా పెద్ద హిట్ అవ్వాల్సిందే. దేవదాస్ చిత్రం ఎలాగూ డివైడ్ టాక్ కి నోచుకుంది కాబట్టి నోటా కు ప్లస్ అవుతుంది. అలాగే నోటా చిత్రం అక్టోబర్ 5న వస్తుండటంతో దేవదాస్ చిత్రానికి ఉన్న థియేటర్ లు పోవడమే కాకుండా వస్తున్న కలెక్షన్స్ కూడా తగ్గిపోవడం ఖాయం . విజయ...

అరవింద సమేత అఫీషియల్ అనౌన్స్ మెంట్

అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు ఆ చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది , మరోవైపున పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాంతో అక్టోబర్11న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది. జగపతిబాబు, నాగబాబు లతో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ , ట్రైలర్ లతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ కు అరవింద సమేత కూడా భారీ విజయాన్ని ఇవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ , ట్రైలర్ తో ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయ్యారు ఇక సినిమా విజయదశమి కానుకగా వస్తుండటంతో బ్లాక్ బస్ట...

ఆమెకు నచ్చితే ఎవరితోనైనా శృంగారం చేయొచ్చట

కట్టుకున్న భర్తతోనే కాపురం చేయాలి , శృంగారం గురించి కానీ పడకగది ముచ్చట్లు కానీ భారత స్త్రీలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదు ఒకప్పుడు కానీ …….కాలం మారింది , మనసుకి నచ్చితే వాడు కట్టుకున్న భర్త కాకపోయినా శృంగారంలో పాల్గొనచ్చు లేదంటే భర్త ని వదిలేసి మరొకడిని పెళ్ళాడోచ్చు లేదా సహజీవనం చేయొచ్చు అలాగే శృంగారం గురించి ……. శృంగారంలో ఉండే భంగిమల గురించి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే స్థితికి వచ్చింది. అంతేనా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నప్పటికీ పరాయి మగాడితో శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని అందుకు భర్త వారించింతే అతడిదే తప్పు అని సంచలన తీర్పు వెలువరించింది. భారత స్త్రీ కి భర్తే సర్వస్వం కానీ ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు నేరాలు చూస్తుంటే అంతకుమించి అనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది మహిళలు పెళ్లి చేసుకున్నప్పటికి ……. ఆ సుఖం కోసం పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటూ చివరకు భర్త నే చంపించే స్థాయికి వచ్చారు . ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే నాగరికత నేర్చిన పలువురు యువతులు సహజీవనం చేస్తున్నారు అయితే ఈ సహజీవన...

దేవదాస్ ప్లాప్ …..జాబితాలో

ఈరోజు విడుదలైన దేవదాస్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది అయితే హీరోలు అక్కినేని నాగార్జున , నాని లు నటించిన చిత్రం కావడంతో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. ఇద్దరు హీరోలకు తోడు హాట్ భామ రష్మీక మందన్న కూడా నటించడంతో మంచి వసూళ్లే వస్తున్నాయి. అయితే దేవదాస్ సినిమాకు ఈ నాలుగు రోజులు బాగానే ఉంటుందని కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా చిత్రం విడుదల అవుతుండటంతో దేవదాస్ కథ కంచికేనని అంటున్నారు. సరైన కథ లేకపోవడంతో పాటుగా స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునేలా లేదని కాకపోతే నాగార్జున -నాని ల నటన వల్ల మాత్రమే సినిమా ఓ మోస్తరుగా ఉందని విమర్శిస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం సినిమా ఫరావలేదని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పనిగట్టుకుని మరీ ప్లాప్ అని ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా నానిపై ఆగ్రహంగా ఉన్న కొంతమంది దేవదాస్ ప్లాప్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. నానిపై కొంతకాలంగా కౌశల్ ఆర్మీ ఆగ్రహంగా ఉంది. ఇక దేవదాస్ సినిమా రిలీజ్ కి ముందే దేవదాస్ ని ప్లాప్ చేస్తాం అంటూ ప్రతిన బూనారు. కౌశల్ పట్ల వివక్ష చూపిస్తున్న నానికి చుక్కలు చూపిస్తామని , దేవదాస్ ని ప్లాప్ చేస్తామని హెచ్చరించారు కూడ...

రేవంత్ రెడ్డిపై పగతీర్చుకుంటున్న కేసీఆర్

నాపై ఐటీ దాడులు చేయడం ఖాయమని , మరో రెండు మూడు రోజుల్లోనే జరుగుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే రేవంత్ చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి ఇంటితో పాటుగా మొత్తం 15 చోట్ల కేంద్రప్రభుత్వ ఈడీ అధికారులతో పాటుగా రాష్ట్ర అధికారులు పెద్దఎత్తున రైడ్ చేసారు . హైదరాబాద్ లో ఉన్న రేవంత్ ఇంటితో పాటుగా అతడి సోదరుడు మరో బంధువు అలాగే కొడంగల్ లలో మొత్తం మీద 15 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించారు . దీంతో రేవంత్ చెప్పినట్లుగానే కేసీఆర్ ప్రభుత్వం పగతీర్చుకుంటోందన్న విషయం బట్టబయలైంది . అయితే కేంద్ర , రాష్ట్ర అధికారులు మాత్రం ఆదాయ లెక్కలను తేల్చడానికే అని అంటున్నారు . రేవంత్ ఇంట్లో లేని సమయంలో దాడులు నిర్వహించడం దారుణమని , అయినా ఎన్ని దాడులు చేసినా , ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మేమంతా రేవంత్ కు అండగా ఉంటామని పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటుగా తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ సంఘీభావం ప్రకటించారు . కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 300 కోట్ల రూపాయలను రేవంత్ తెరవెనుక సమకూర్చినట్లు భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే కేంద...

జనసేన తరుపున పోటీ చేయనున్న నాగబాబు ?

మెగా బ్రదర్ నాగబాబు జనసేన తరుపున వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరుపున దెందులూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చింతమనేని ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. చింతమనేని ప్రభాకర్ గతకొంత కాలంగా పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు దాంతో అతడిపై ఆగ్రహంగా ఉన్న పవన్ అతడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే పవన్ వార్నింగ్ కి సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్. పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నాపై పోటీ చెయ్ అంటూ సవాల్ విసిరాడు దాంతో పవన్ కళ్యాణ్ అహం దెబ్బతింది. దాంతో దెందులూరు అసెంబ్లీ స్థానం నుండి రాబోయే ఎన్నికల్లో అన్నయ్య నాగబాబు ని పోటీకి నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడాట పవన్ . ప్రస్తుతం పోటీ చేయించాలన్న దిశగా ఆలోచనలు చేస్తున్నాడు పవన్ అయితే దానికి నాగబాబు ఒప్పుకోవాలి. ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ తో బిజీగా ఉన్నాడు. అలాగే రాజకీయాల పట్ల కూడా ఆసక్తిగా ఉన్నాడు. తమ్ముడికి అండగా ఉండాలని డిసైడ్ అయ్యాడట కానీ పోటీ విషయంలో మాత్రం నిర్ణయించుకోలేదు నాగబాబు . అయితే పవన్ కళ్యాణ్ పట్టుబట్టితే మాత్రం నాగబాబు దెందులూరు నుండి రంగ...

దేవదాస్ టాక్ ఎలా ఉందంటే

అక్కినేని నాగార్జున , నాని ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం దేవదాస్ ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో పడ్డాయి దాంతో ఈ సినిమాని చూసిన వాళ్ళు అప్పుడే సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇంతకీ నెటిజన్లు ఇస్తున్న రివ్యూ ప్రకారం దేవదాస్ యావరేజ్ మాత్రమే ! అంటే ప్లాప్ సినిమా అన్నమాట . నాగార్జున , నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకునేలా ఉన్నాయని అంతేతప్ప సినిమాలో కథ లేదని అలాగే ఆకట్టుకునే కథనం కూడా లేదని పెదవి విరుస్తున్నారు. దేవదాస్ చిత్రాన్ని చూసిన ఎక్కువమంది పెద్దగా బాగోలేదని తేల్చిచెబుతుండగా కొంతమంది నాని , నాగార్జున అభిమానులు మాత్రం సినిమా ప్లాప్ ఏమి కాదని బాగానే ఉందని ట్వీట్ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదలైంది దేవదాస్ చిత్రం . అయితే ఈ సినిమాకు మొదటి నుండి కూడా క్రేజ్ రాలేదు. నాగార్జున , నాని లాంటి మల్టీస్టారర్ చిత్రం అయినప్పటికీ అనుకున్న స్థాయిలో క్రేజ్ దక్కలేదు. నాగార్జున డాన్ గా నటించగా నాని డాక్టర్ గా నటించాడు. అయితే క...

నానా పటేకర్ ఆ హీరోయిన్ ని ఇబ్బందిపెట్టాడట

నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా . నానా పటేకర్ తో నటించిన సమయంలో ఓ పాట చిత్రీకరిస్తున్న సందర్భంగా నన్ను తాకుతూ ఇబ్బందిపెట్టాడని , అసలు డ్యాన్స్ మాస్టర్ ని పక్కనపెట్టి తానే డ్యాన్స్ మూమెంట్స్ చెబుతూ నాపై చేతులు వేస్తూ చాలా అసహ్యంగా ప్రవర్తించాడని అందుకే ఆ పాట చేయనని వెళ్లిపోయానని దాంతో మరొకరితో ఆ పాట చేసారని సంచలన వ్యాఖ్యలు చేసింది తనుశ్రీ దత్తా . నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర చిత్రంలో నటించింది తనుశ్రీ దత్తా . అలాగే మరో తెలుగు చిత్రంలో నటించినప్పటికీ రెండు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో ఈ భామకు తెలుగులో మళ్లీ ఛాన్స్ రాలేదు. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ భామకు సినిమాలు లేకుండాపోయాయి. బాలీవుడ్ లో సినిమాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా….. నానా పటేకర్ పై ఆరోపణలు చేయడమే ! అయితే తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పట్లో మీడియా కొద్దిరోజులు తెగ హడావుడి చేసింది కానీ తర్వాత ఆవిషయం మరుగున పడిపోయింది. ఇక ఈ భామకు ఛాన్స్ లు లేకపోవడంతో అమెరికా వెళ్లిపోయింది. ఇక ఇటీవల ఇండియాకు తిరిగివచ్చిన తనుశ్రీ దత్తా రజనీకాంత్, అక్షయ్ కుమార్ లపై నిప్పులు చెరిగింది. న...

నాగార్జున – నాని హిట్ కొడతారా

నాగార్జున , నాని కాంబినేషన్ లో దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటించగా నాని సరసన రష్మీక మందన్న నటించింది. వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై అటు నాగార్జున ఇటు నాని ఇద్దరు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. పైగా మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఇద్దరు హీరోలు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే హిట్ అయితే ఫరవాలేదు కానీ ప్లాప్ అయితే మాత్రం ఇద్దరి ఇమేజ్ కి సంబంధించిన విషయం కాబట్టి ఇద్దరు కూడా టెన్షన్ పడుతున్నారు. దేవదాస్ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు . దానికితోడు పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు దాంతో దేవదాస్ చిత్రానికి క్రేజ్ లేకుండా పోయింది. కాకపోతే కాస్త ఎట్రాక్షన్ గా హాట్ భామ రష్మీక మందన్న నిలిచింది ఈ దేవదాస్ చిత్రానికి. ఛలో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామకు అది హిట్ కావడంతో గీత గోవిందం వచ్చింది ఇక గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం కాపీ కొట్టిన బాపతు అని తెలుస్తోంది కానీ దర్శకుడు మాత్రం కాపీ ...

సువర్ణసుందరి నుంచి “సాహో సార్వ భౌమి” సాంగ్ 28న విడుదల

తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు.అదే కోవలో నాలుగు జన్మలను మిళితం చేస్తూ రొలర్ కొస్టర్ స్ర్కీన్ ప్లే తో సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా “సువర్ణ సుందరి ” తెరకెక్కుతోంది. సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ” సాహో సార్వ భౌమి” అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో వచ్చిన “సువర్ణ సుందరి ” టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం...

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా దంపతులు

కేసీఆర్ , కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులు బలమైన నాయకులు కావడంతో వీరి చేరికతో వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని నమ్మకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు . కొండా దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు. వరంగల్ ఈస్ట్ ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖకు టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కేసీఆర్ , కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేసారు కొండా దంపతులు. కొండా దంపతుల ప్రభావం వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. వరంగల్ ఈస్ట్ తో పాటుగా భూపాలపల్లి , పరకాల , వర్ధన్నపేట , పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో కొండా దంపతుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దాంతో మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొండా సురేఖ తెలంగాణ మొత్త...

ప్లాప్ డైరెక్టర్ తో సినిమానా

బొమ్మరిల్లు చిత్రం తప్ప మరో హిట్ లేదు బొమ్మరిల్లు భాస్కర్ కు , బొమ్మరిల్లు చిత్రం తర్వాత చేసిన సినిమాలన్నీ ఘోర పరాజయాలు అందుకున్నాయి అయితే ఒక్క పరుగు చిత్రానికి మినహాయింపు ఉంది , అది పెద్ద హిట్ కాదుకానీ హిట్ అయ్యింది . తమిళంలో కూడా ఓ సినిమా ట్రై చేసాడు కానీ అది కూడా వర్కౌట్ కాలేదు దాంతో ఈ దర్శకుడికి సినిమాలు లేకుండాపోయాయి . అప్పటి నుండి బొమ్మరిల్లు భాస్కర్ పలువురు హీరోల దగ్గరకు వెళ్తున్నాడు కానీ ఎవరు కూడా సినిమా ఇచ్చే సాహసం చేయడం లేదు దానికి తోడు ఆరెంజ్ చిత్రం భారీ ప్లాప్ అవ్వడంతో నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బొమ్మరిల్లు భాస్కర్ ని పలు వేదికల మీద చీల్చి చెండాడాడు దాంతో కూడా కావచ్చు భాస్కర్ కు సినిమాలు లేకుండా పోయాయి . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం సీనియర్ హీరో వెంకటేష్ కు బొమ్మరిల్లు భాస్కర్ ఓ కథ చెప్పాడని అది వెంకటేష్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఏ హీరో కూడా భాస్కర్ కు ఛాన్స్ ఇవ్వడానికి భయపడుతున్న ఈరోజుల్లో వెంకటేష్ ఎలా ఛాన్స్ ఇచ్చాడో అంటూ ఆశ్చర్యపోతున్నారు . అయితే సురేష్ బాబు కథ ఓకే చేసాడంటే మామూలు విషయం కాదని చాలారోజులుగా భాస్కర్ కథ ని చెక...

వరంగల్ లో టిఆర్ఎస్ 3 స్థానాల్లో ఓడిపోవడం ఖాయం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాగా వాటిలో మూడు నియోజకవర్గాల్లో మాత్రం కొండా దంపతుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది దాంతో మూడు నియోజకవర్గాల్లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఓడిపోవడం ఖాయమైపోయింది . వరంగల్ ఈస్ట్ , భూపాలపల్లి , పరకాల అసెంబ్లీ స్థానాల్లో కొండా సురేఖ తో పాటు కొండా మురళి కి ప్రాబల్యం ఎక్కువగా ఉంది పైగా శాయంపేట నుండి వరుసగా పోటీచేసి గెలుపొందింది కూడా . అలాగే పరకాలలో కూడా పెద్ద ఎత్తున అనుచరవర్గం ఉంది కొండా దంపతులకు ఇక వరంగల్ ఈస్ట్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పోటీచేసి గెలిచారు . అయితే ఈసారి మాత్రం కొండా సురేఖకు కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేసింది కొండా సురేఖ . ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ పైన కేటీఆర్ పైన తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు . రెండు స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నారు అలాగే వరంగల్ ఈస్ట్ తో పాటుగా భూపాలపల్లి , పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని కంకణం కట్టుకున్నారట కొండా దంపతులు . వాళ్ళు కనుక దృష్టి పెడితే ఆ మూడు స్థానాలు టీఆర్ఎస్ కోల్ప...

పాపం ….. ఆ సినిమాని పట్టుంచుకునే వాడే లేడు

మణిరత్నం సినిమా అంటే ఒకప్పుడు హాట్ కేక్ , కానీ కాలం మారింది దానికి తోడు వరుసగా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో ఈ దర్శకుడి సినిమాని పట్టుంచుకోవడమే మానేశారు ప్రేక్షకులు అలాగే సినిమా రంగంలోని పలువురు ప్రముఖులు కూడా . మణిరత్నం సినిమా వస్తోందంటే తెలుగు హక్కుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడేవాళ్ళు కానీ ఇప్పుడు పిలిచి మరీ ఇస్తామంటే కూడా లెక్కచేయడం లేదు . సక్సెస్ మహిమ అంటే అదే ! సక్సెస్ లో ఉన్నప్పుడు మణిరత్నం వెంట పడ్డారు చాలామంది కానీ వరుస పరాజయాలు పలకరించడంతో మణిరత్నం సినిమా అంటే భయపడిపోతున్నారు కనీసం పేస్టింగ్ ఖర్చులైనా వస్తాయా ? అని . తాజాగా మణిరత్నం భారీ కాస్టింగ్ తో నవాబ్ అనే సినిమా చేసాడు , విచిత్రం ఏంటంటే రేపే ఆ సినిమా విడుదల అవుతోంది . అయితే నవాబ్ గురించి పెద్దగా బజ్ లేకుండాపోయింది . దాంతో థియేటర్ లు కూడా పెద్దగా లభించడం లేదు , మరోవైపు నాగార్జున నాని సినిమా దేవదాస్ కూడా రిలీజ్ అవుతోంది దాంతో నవాబ్ ని పట్టించుకున్న పాపాన పోలేదు . అయితే సినిమా బాగుంది అని టాక్ వస్తే మాత్రం అది నిలబడొచ్చు లేదంటే ఇతర సినిమాల్లాగే ఇది కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే ! English Title: No buzz ...

అన్ సెన్సార్డ్ వీడియోలు ఇంత హాట్ గానా ?

XXX అన్ సెన్సార్డ్ వీడియోలు మూడు రిలీజ్ చేసారు . ఒక్కో వీడియో 20 సెకన్ల పాటు ఉండగా మూడు కలిపి 60 సెకన్లు ఉన్నాయి , ఇక మూడు కూడా ఎంత హాట్ గా ఉన్నాయంటే చాలా చాలా హాట్ గా ఉన్నాయి వాటిని చూస్తే పిచ్చిలేవడం ఖాయం అంత దారుణంగా ఉన్నాయి . పైగా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించింది ఓ మహిళ కావడం విశేషం , ఏక్తా కపూర్ ఈ ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ వెబ్ సిరీస్ ని నిర్మిస్తోంది . త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రానుండగా ముందుగా యువతని రెచ్చగొట్టడానికి శాంపిల్ గా మూడు వీడియోలను విడుదల చేసింది ఏక్తా కపూర్ . ఈ మూడు వీడియో లలో కూడా దాదాపుగా సన్నీ లియోన్ పోర్న్ సినిమాలలాగే ఉన్నాయి ఆ వీడియోలు . వెబ్ సిరీస్ లు హాలీవుడ్ రేంజ్ లో బాలీవుడ్ లో ఇంతవరకు ఎవరూ చేయలేదు కానీ యాక్షన్ ని పక్కనపెట్టి శృంగార పరంగా మాత్రం హాలీవుడ్ వాళ్లతో పోటీపడి మరీ చేసింది ఏక్తా కపూర్ . ఇక ఈ వెబ్ సిరీస్ లో బాలయ్య సరసన పైసా వసూల్ చిత్రంలో నటించిన కైరా దత్ ఈ శృంగార చిత్రంలో నటించడం విశేషం . శృంగార దృశ్యాల్లో పిచ్చిలేపింది కైరా దత్ . ఇక ఈ వెబ్ సిరీస్ సరికొత్త ట్రెండ్ సృష్టించేలా కనిపిస్తోంది . నభూతో నభవిష్యత్ అన్న మాటని పూర్తిగా మార్చేసి నా బూతే నా భ...

ప్రణయ్ ని హత్య చేయించిన మారుతీరావు కు మద్దతుగా ర్యాలీ

మిర్యాలగూడ లో ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ విషయంలో ప్రణయ్ ని హత్య చేయించిన అమృత తండ్రి మారుతీరావు పై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా జరిగిన సంఘటనతో మిర్యాలగూడ ప్రజలు పిచ్చ షాక్ ఇచ్చారు . ఏకంగా మారుతీరావు కి మద్దతుగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడమే కాకుండా ఏకంగా జిల్లా ఎస్పీ ని కలిసి వినతి పత్రం ఇవ్వడమే కాకుండా ప్రణయ్ విగ్రహం మిర్యాలగూడలో పెడితే సహించేది లేదని , అందుకు మీరు అనుమతి ఇవ్వొద్దని వేడుకున్నారు కూడా . అంతేగాదు జైల్లో ఉన్న మారుతీరావు ని కలిసేలా అనుమతి ఇవ్వాలని కూడా కోరారు అయితే జైలు అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు కానీ మారుతీరావు తమ్ముడు శ్రవణ్ ని మాత్రం కలిసేలా అనుమతి ఇచ్చారు . దాంతో శ్రవణ్ ని కలిసి మీకు మద్దతుగా మేమున్నాం అంటూ పెద్ద ఎత్తున మిర్యాలగూడ వర్తకులు పాల్గొన్నారు . ఎస్పీ ని కలిసిన సమయంలో ప్రణయ్ విగ్రహం పెట్టడం వల్ల అనర్దాలకు దారి తీస్తుందని చక్కగా వివరించారు . ప్రణయ్ విగ్రహం పెట్టి ఏ సందేశం ఇవ్వనున్నామో చెప్పారు . ప్రణయ్ పెద్దగా చదువుకోలేదు చిన్న వయసులోనే ప్రేమించి అదే నిజమైన ప్రేమ అనుకోవడం పాఠశాలకు వెళ్లే స...