Skip to main content

ఎస్ ఎస్ థమన్ చేతుల మీదుగా “నీలాకాశం” ఆల్బమ్ విడుదల..

సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాన్తన కలిగించనుంది. ‘సీతారామరాజు’ అనే కొత్త సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత దీనితో పరిచయం అవుతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా
పండ్రంకి మొదలగు కొత్త గాత్రాలు సందడి చేయనున్నాయి. ఈ టీమ్ వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో శ్రమించి ఆహ్లాదమైన పాటలను ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధురమైన నీలాకాశం ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్ లోనికి రానున్నాయి. ఈ విడుదల కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిచే శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ…ఆశీర్వాద్ గారికి మాకు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. చెన్నైలో తరచూ కలుస్తుంటాము. మా నాన్న గారికి ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ కమ్యూనికేషన్ తోనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా మందికి లైట్ మ్యూజిక్ చాలా పాటలకు ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు అదొక మెడిసిన్ కూడా.. ఇలాంటి లైట్ మ్యూజిక్ ను సీతారామ రాజు, ఆశీర్వాదం గారు శ్రోతలకు అందించడానికి చేసే ఈ ప్రయత్నం ఎంతో గొప్పది. ఈ నీలాకాశం ఆల్బమ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగర్స్ అందరికీ బెస్ట్ విషెస్ తెలువుతున్నా అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. గంటశాల గారు అప్పట్లో ఇలాంటి లైట్ మ్యూజిక్ నే చేసేవారు. ఆలాంటి మ్యూజిక్ వలనే ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ వచ్చాయి. ఆ తరాన్ని అనుసరిస్తూ ఇప్పుడు నీలాకాశం అనే లైట్ మ్యూజిక్ ఆల్బమ్ ను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ జనరేషన్ కు అయినా.. ఎప్పుడు విన్నా ఈ లైట్ మ్యూజిక్ ఆహ్లాదంగా అనిపిస్తూనే ఉంటుంది. వీరి స్ఫూర్తి తో మరెన్నో లైట్ మ్యూజిక్స్ రావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ ఆల్బమ్ లో పాడిన నూతన సింగర్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా అన్నారు.

సీతారామ్ రాజు మాట్లాడుతూ.. మేము అడగ్గానే నీలాకాశం ఆల్బమ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.

ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన థమన్ మరియు భరద్వాజ్ అలానే సిగర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ నీలాకాశం మ్యూజిక్ ఆల్బమ్ లో అటు అందమైన మెలోడీలతో పాటు ఆధునికమైన అమరికతో కూడిన సంగీతాన్ని వినచ్చు అని తెలియచేసారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సింగర్స్ కృష్ణ తేజ, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2QZyJh9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...