Skip to main content

ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ `మ‌హ‌ర్షి` సంగీతంలో భాగ‌మైన టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్ వీడియో విడుద‌ల చేస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌

డి.ఎస్‌.పి…దేవిశ్రీ ప్ర‌సాద్
నేటి యువ సంగీత సంచ‌ల‌నం.. రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతం అందించిన మ్యూజిషియ‌న్‌. ప్రేక్ష‌కుల‌కు ఫుట్ టాపింగ్ సంగీతం అందిస్తున్న డి.ఎస్‌.పి ని అంద‌రూ రాక్‌స్టార్ అని పిలుచుకుంటారు. ఈ ఏడాది ఈ `మ‌హ‌ర్షి`వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌కు సంగీతాన్ని అందించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు.
`మ‌హ‌ర్షి` సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీయే కాదు.. ఆయ‌న సిల్వ‌ర్ జూబ్లీ మూవీ కూడా కావ‌డం విశేషం. సూపర్ స్టార్ అభిమానులు `మ‌హ‌ర్షి` సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురు చూశార‌న‌డానికి ఆ సినిమా సాధించిన స‌క్సెసే రుజువుగా నిలిచింది. ఈ సినిమా ప్రారంభం నుండి విడుద‌ల వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను క్యారీ చేయ‌డంలో దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కీల‌క భూమిక పోషించింది. రైతు కోసం పోరాడే క‌థానాయ‌కుడి ఫీల్‌ను త‌న సంగీతంతో ప్రేక్ష‌కుడి గుండెకు హ‌త్తుకునేలా చేయ‌డం దేవిశ్రీకే చెల్లింద‌నాలి. ఇక సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. సినిమా కంటెంట్‌, సోల్‌, ఎమోష‌న్‌ను చివ‌రి వ‌ర‌కు ఆడియన్ క‌ట్టిప‌డేసేలా చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు డి.ఎస్‌.పి.
సినిమాకు ప‌నిచేసే శాఖ‌ల‌న్నీ వాటి ప‌నుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌నే విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అప్పుడే ఓ సినిమాకు ప‌రిపూర్ణ విజ‌యం సాధ్య‌మ‌వుతుంది. అయితే ద‌ర్శ‌కుడు త‌న చెప్పాల‌నుకున్న ఫీల్‌ను ఆడియ‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసేది మాత్రం సంగీతం.. ముఖ్యంగా మ‌హ‌ర్షి బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్‌లో నిలిచింది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, రాక్‌స్టార్‌పై పూర్తి భ‌రోసాతో ఇచ్చిన స్వేచ్ఛ‌ను .. అందుకు వ‌చ్చిన రిజ‌ల్టే సోదాహ‌ర‌ణంగా నిలిచింది.
`మ‌హ‌ర్షి` విజ‌యంలో చాలా పెద్ద పాత్ర‌ను పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ …“ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన `మ‌హ‌ర్షి` విడుద‌లై నెల‌రోజుల‌వుతుంది. ఇంత‌టి గొప్ప విజ‌యాన్ని అందించి, అంద‌మైన అనుభూతిని మిగిల్చిన ప్ర‌తి ఆడియ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత‌లు దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌గారు, పివిపిగారికి థాంక్స్‌. నా సంగీతంపై మ‌హేష్‌గారు చూపే ఆద‌ర‌ణ‌, న‌మ్మ‌కానికి ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌గారి త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి కూడా వ‌ర్క్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు నేను ఇంత మంచి సంగీతం అందించానంటే కార‌ణం నా టీం. నాతో పాటు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నేది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇంత మంచి ఆల్బ‌మ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ రావ‌డానికి కార‌ణ‌మైన ఈ టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్‌గా ఓ వీడియో విడుద‌ల చేస్తున్నాను. ఈ వీడియోలో సినిమా మ్యూజిక్‌లో పార్ట్ అయిన టెక్నీషియ‌న్స్ అందరినీ చూపిస్తున్నాం. ప్రేక్ష‌కులు ఇలాగే వారి అభిమానాన్ని, ప్రేమ‌ను నాపై చూపిస్తూ ఉండాల‌ని కోరుకుంటున్నాను. థాంక్యూ…“ అన్నారు.
……………………………………



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2IthLEi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...