Skip to main content

తెలుగు సినిమాకు రాయితీలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Andhra Pradesh government announces subsidies for Telugu cinema*బడ్జెట్ 4 కోట్లు లోపు నిర్మించే చిత్రాలకు ఏ పి టాక్స్ లేదు.
*ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా నిర్మించు లొకేషన్స్ ఉచితంగా పర్మిషన్.
*FDC ద్వారా షూటింగ్ లకు సింగల్ విండో ద్వారా అనుమతి.
*FDC పర్యవేక్షణలో ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు సబ్సిడీ ఏడాదికి 15 చిత్రాలకు మాత్రమే.. *వైజాగ్ రామానాయుడు స్టూడియో సమీపంలో 316 ఎకరాలలో స్టూడియో లు నిర్మించడానికి అనుమతి.
*నవంబర్‌, డిసెంబర్‌లో సినీ, టీవీ నంది అవార్డ్సు ఫంక్షన్‌.
* పుణా ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ తరహా అమరావతిలో 20 ఎకరాలలో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌.

ఏపీ ప్రభుత్వం చిన్న సినిమాలకు పలు ప్రోత్సాహకాలను కలిపిస్తోంది. పన్ను రాయితీలు ఇవ్వనుంది. జీఎస్‌టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్‌ 116 జారీ చేసినట్లు ఏపీ ఫిలిండవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అంబికాకృష్ణ పత్రికా ముఖంగా వెల్లడించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న సినిమాలకు అండగా ఉండాలని ఆంద్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు

ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ 4 కోట్లలోపు పెట్టుబడితో తీసే సినిమాలకు ఈ రాయితీలు వర్తింపచేయాలని నిర్ణయించాము. కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్ధికంగా ఎన్ని ఒడిదుడుకులున్నా చిత్ర పరిశ్రమకు అండగా నిలవాలని ముఖ్య మంత్రిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వ ఉతర్వుల ప్రకారం ఆంధ్ర రాష్ట్రము లో నిర్మించే చిత్రాలకు ఈ రాయితీలు వస్తిస్తాయి. ఇక్కడ ఇంకా సాంకేతికపరంగా వసతులు లేవు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో కొన్ని మినహాహింపులు ఉంటాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్‌ లో తీసే సినిమాల షూటింగ్‌లు ఉచితంగా చేసుకోవడానికి అనుమతులు ఇస్తాము . అయితే ముందుగా కాషన్‌ డిపాజిట్‌ సినీ నిర్మాత చెల్లిస్తే షూటింగ్‌ తర్వాత తిరిగి వారికి చెల్లిస్తాము. ఏపీలో తీసే సినిమాలకు ఎఫ్‌డీసీ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తాము .

ఈ సినిమాలపై టాక్స్‌ రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుంది రూ 4 కోట్లలోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18 శాతంలో.. రాష్ట్ర జీఎస్టీ 9 శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్‌ప్రొడక్షన్‌, షూటింగ్‌, డబ్బింగ్‌ చేయాలనే నిబంధన పెట్టామన్నారు. సినిమాలో నటించే వారికి ఇచ్చే రెమ్యూనరేషన్‌ తప్ప ప్రొడక్షన్ ప్రీ బడ్జెట్ వివరాలు ముందుగానే ఏ పి యఫ్ డి సి కి ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. చలనచిత్రం మొత్తం ఏపీలోనే నిర్మించారా?లేదా అనే అంశాన్ని ఏ పి యఫ్ డి సి నిర్థారించిన తర్వాతే రాయితీని విడుదల చేస్తాము.” ఇంకా నిబంధనలను సడలించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన కథాంశాలతో తీసే చిన్న సినిమాలకు రూ 10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. అయితే ఏడాదికి 15 చిన్న సినిమాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. వాటిని ఎంపిక చేయడానికి సినీ పరిశ్రమలో వున్నా ప్రముఖుల తో కమిటీ వేస్తామన్నారు. విశాఖ, భీమిలిరోడ్డు మార్గంలో రామ నాయుడుగారి స్టూడియో సమీపం లో గతంలో కేటాయించిన 316 ఎకరాల స్థలంలో స్టూడియోలు నిర్మించేం దుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు.

ఇందుకు ఎకరం రూ. 50 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించినందున దాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఏవీఏం సంస్థలు స్టూడియోల నిర్మాణానికి దరఖాస్తు చేశాయన్నారు. సీఎం చంద్రబాబు ఇందుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సినిమా థియేటర్లు కొందరి చేతిలోనే ఉన్న విషయం వాస్తవమేనని.. వారికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న లాభం ఏమీలేదన్నారు. రోజుకు 5 ఆటలు వేయడం వలన పెద్ద స్టార్స్ మూవీ తొలి రోజు వసూళ్లు పరవాలేదు కానీ, ఆ తరువాత ఒకోసారి షోస్ రద్దు చేయడం కూడా జరుగుతుంది. రోజు ప్రదర్శించే నాలుగు ఆటలలో ఒక షో తప్పని సరిగా చిన్న సినిమా వేసేలా మీరు (జర్నలిస్టులు) ఇచ్చిన సూచనా మేరకు ఏ పి యఫ్ డి సి ఆలోసిస్తుందని, 5 సంవత్సరాల టి వి నందీ అవార్డులు ఒకే సారి నవంబర్ డిసెంబర్‌లలో భారీ ఎత్తున ప్రధానోత్సవం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ పత్రికా సమావేశం లో ప్రభుత్వ మేనేజర్ సాయి, అంబికా రామచంద్ర రావు పాల్గొన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2o1mZxg

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...