Skip to main content

పెరాక్ లో త‌క్కువ బ‌డ్జెట్ తో షూటింగ్ చేసుకోవ‌చ్చట

తెలుగు సినిమా రోజురోజుకు అభివృద్ది చెందుతుండ‌డం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..విదేశాల్లో సైతం తెలుగు సినిమాకి డిమాండ్ ఉండ‌డంతో ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విదేశాల్లో ఉన్న ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రెడీ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసే సినిమాల‌కు ఆయా దేశాలు షూటింగ్ ప‌ర్మిష‌న్స్ స‌కాలంలో ఇప్పించ‌డంతో పాటు రిట‌ర్న్ గిఫ్ట్ లా కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. తాజాగా మ‌లేషియా ప్ర‌భుత్వం కూడా త‌మ దేశంలో షూటింగ్ చేస్తే స‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంతో పాటు త‌మ దేశంలో కావ‌ల్సిన అన్ని ప‌ర్మిష‌న్స్ ను వెంట‌నే అందిస్తామంటోంది.
మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ మీట్ & గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి  గురు ఫిల్మ్స్ సునీత తాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.
ఈ కార్య‌క్ర‌మంలో మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ పైజ‌ల్ అజుమూ మాట్లాడుతూ…నా ఫ్రెండ్ మ‌హేష్ తో ఎప్ప‌టి నుంచో ఇండియా రావాలి అని చెప్పాను. ఈరోజు హైద‌రాబాద్ రావ‌డం చాలా హ్యాపీగా ఉంది.  ఇండియా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మ‌లేషియాలో సంవ‌త్స‌రానికి ఒక‌సారైనా ఇండియా ఫుడ్ తింటుంటాను. కౌలాలాంపూర్ నుంచి చెన్నైకి రావ‌డానికి 3 గంట‌లు ప‌ట్టింది. చెన్నై నుంచి హైద‌రాబాద్ రావ‌డానికి 3 గంట‌ల టైమ్ ప‌ట్టింది. దీనిని బ‌ట్టి ఇండియా ఎంత పెద్ద‌దో అర్ధం చేసుకోవ‌చ్చు.
ఇక నా గురించి చెప్పాలంటే..ద‌త్తా శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ అయిన‌ప్ప‌టికీ పెజా అని పిలుస్తారు. మ‌లేషియాలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. అక్క‌డ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో పెరాక్ ఒక‌టి. పెరాక్ అంటే సిల్వ‌ర్ అని అర్ధం. ఈ రాష్ట్రంలో 48% అడ‌వి ఉంటుంది. పెరాక్ లో వాతావ‌ర‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాత‌లు ఏసియాలో చాలా దేశాల‌కు వెళ్లుంటారు. అయితే…పెరాక్ రాష్ట్రం రావాల‌ని కోరుతున్నాను. తెలుగు నిర్మాత‌ల‌ను ఆహ్వానించ‌డం కోస‌మే హైద‌రాబాద్ వ‌చ్చాను. నా మిత్రుడు మ‌హేష్, వివేక్ కూచిభ‌ట్ల న‌న్ను ఇక్క‌డికి రావాల‌ని ఆహ్వానించారు. వారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.
ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఏషియాలోనే జ‌రుగుతోంది. ఏషియ‌న్స్ అంద‌రూ ఒక్క‌టే అని నా ఫీలింగ్. షూటింగ్ నిమిత్తం యు.ఎస్ వెళుతుంటారు. కానీ..ఇండియ‌న్ మూవీస్ ని అక్క‌డ చూడ‌రు. ఏషియాలో లోకేష‌న్స్ చాలా ఉన్నాయి. అందుచేత ఇక్క‌డే షూటింగ్ చేయాల‌ని కోరుతున్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి ఇండియ‌న్ సినిమాని ఫాలో అవుతుంటాను. కానీ..ఇండియ‌న్ సినిమాల‌ని ఏసియాలో కాకుండా ఎక్కువుగా యు.ఎస్ లో షూటింగ్ చేస్తుండ‌డం బాధ‌గా అనిపిస్తుంది. పెరాక్ రాష్ట్రంలో షూటింగ్ చేస్తే త‌క్కువ బ‌డ్జెట్ అవుతుంది. మా ద‌గ్గ‌ర డ్యాన్స‌ర్స్, టెక్నీషియ‌న్న్ చాలా మంది ఉన్నారు. అలాగే మా రాష్ట్రంలో తెలుగు, త‌మిళ సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు. తెలుగు సినిమాల్లో సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంటుంది. పెరాక్ లో మీరు కావాలంటే సెట్స్ కూడా వేసుకోవ‌చ్చు. బ‌డ్జెట్ కూడా చాలా త‌క్కువు అవుతుంది. అందుచేత తెలుగు సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పెరాక్ రాష్ట్రంలో రావాల‌ని..షూటింగ్స్ చేయాల‌ని ఆహ్వానిస్తున్నాను అన్నారు.
మ‌లేషియాలో పెరాక్ మాత్ర‌మే కాకుండా కంబోడియా, థాయ్ లాండ్, సింగ‌పూర్ ల‌లో షూటింగ్ చేసుకోవ‌చ్చు. మా రాష్ట్రంలో చాలా మంది ఇండియ‌న్స్ ఉన్నారు. మ‌లేషియాను ట్రూలీ ఏసియా అంటారు. వేరే దేశంలో షూటింగ్ చేయ‌డం కంటే మా ద‌గ్గ‌ర షూటింగ్ చేస్తే చాలా త‌క్కువ బ‌డ్జెట్ అవుతుంది. పెరాక్ లో చాలా మందికి సినిమా అంటే ఇష్టం. వాళ్లు ఫ్రీగా న‌టించ‌డానికి కూడా రెడీ. ఒక్క‌సారి తెర పై క‌నిపిస్తే చాలు అనుకుంటారు. అంతిష్టం వాళ్ల‌కి సినిమా అంటే. మీకు ఎలాంటి ప‌ర్మిష‌న్ కావాల‌న్నా న‌న్ను సంప్ర‌దిస్తే వెంట‌నే అనుమ‌తి ఇస్తాను. ఈరోజు ఇలా తెలుగు సినిమా నిర్మాత‌ల‌ను క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ మాట్లాడుతూ…మా దేశం వచ్చినందుకు  పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ పైజ‌ల్ అజుమూ గారికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ విన‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఇక నుంచి మా సినిమా మేనేజ‌ర్లు యూర‌ప్ అంటే వెళ్లం. మ‌లేషియాకే వ‌స్తాం. మ‌లేషియా అంటే కౌలాలాంపూర్ మాత్ర‌మే అనుకునే వాళ్లం. కానీ…చాలా మంచి బ్యూటీఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడే తెలిసింది. సినిమా అనేది ప్ర‌పంచాన్ని చూడ‌డానికి విండో లాంటిది. వెంట‌నే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నిపిస్తుంది. పెరాక్ ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ గారితో మీట & గ్రీట్  కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మ‌హేష్,వివేక్ కూచిభ‌ట్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ…త్వ‌ర‌లోనే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నుకుంటున్నాను. ఈరోజు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ గార్ని నిర్మాత వివేక్ కూచిభ‌ట్ల శాలువా, పుష్ప‌గుఛ్చం ఇచ్చి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి, రాథామోహ‌న్, డి.ఎస్.రావు, మైత్రీ మూవీస్ ర‌వి, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్,   అనిల్ సుంక‌ర‌, శివ‌కుమార్, రాజ్ కందుకూరి, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్, జ‌గ‌న్, బెక్కం వేణుగోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
English Title : Parak CM visits hyderabad


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BwCIe1

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...