Skip to main content

`పైసా ప‌ర‌మాత్మ` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి

paisa paramathma post production completeకొత్త‌ద‌నం, వైవిధ్యం ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. స్టార్లు లేక‌పోయినా, సినిమాలో క‌థ‌, కంటెంట్ విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్నాయి. ఆ విష‌యాన్ని ఇటీవ‌లే రిలీజైన కొన్ని ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు నిరూపించాయి. గూఢ‌చారి, అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100, పెళ్లి చూపులు చిత్రాలు ఈ త‌ర‌హానే. ప‌క్కా కంటెంట్‌, ఆర్టిస్టుల ప్ర‌తిభ‌, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల గ‌ట్స్ ఈ చిత్రాల విజ‌యాల‌కు కార‌ణం. ఇప్పుడు అదే బాట‌లో అదే కాన్ఫిడెన్స్‌తో వ‌స్తున్న మ‌రో క్రేజీ సినిమా `పైసా ప‌ర‌మాత్మ‌`. సంకేత్‌, సుధీర్, క్రిష్ణ తేజ‌, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై టి.కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. విజ‌య్ కిర‌ణ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కనిష్క్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

నిర్మాత కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ -“క‌థ‌, కంటెంట్‌పై న‌మ్మ‌కంతో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా చిత్రీక‌రించాం. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్‌. ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ప్ర‌తిభావంతంగా తెర‌కెక్కించారు. ఇదివ‌ర‌కూ బోనాలు పండగ సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశాం. రాజ్ కందుకూరి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. వీటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. చ‌క్క‌ని యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నాం. ప్రేక్ష‌కుల ఆశీస్సులు మాకు ఉంటాయ‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ -“అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చే చ‌క్క‌ని చిత్ర‌మిది. ఈ సినిమాకి పాట‌లు, సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. మునుముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మ‌రింత‌గా ఉధృతం చేస్తున్నాం. యూత్‌, ఫ్యామిలీస్ మెచ్చే ఆస‌క్తిక‌ర క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. క‌థ‌నం హైలైట్‌గా ఉంటుంది“ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UjtSsr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...