
నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ -“కథ, కంటెంట్పై నమ్మకంతో తెరకెక్కించిన చిత్రమిది. లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా చిత్రీకరించాం. నటీనటుల ప్రదర్శన హైలైట్. దర్శకుడు ఈ చిత్రాన్ని నేటి ట్రెండ్కి తగ్గట్టుగా ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఇదివరకూ బోనాలు పండగ సందర్భంగా మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేశాం. రాజ్ కందుకూరి పోస్టర్లను ఆవిష్కరించి ఆశీస్సులు అందించారు. వీటికి చక్కని స్పందన వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. చక్కని యూత్ఫుల్ ఎంటర్టైనర్ని అందిస్తున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం“ అన్నారు.
దర్శకుడు విజయ్ కిరణ్ మాట్లాడుతూ -“అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చక్కని చిత్రమిది. ఈ సినిమాకి పాటలు, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. మునుముందు ప్రచార కార్యక్రమాలు మరింతగా ఉధృతం చేస్తున్నాం. యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్గా ఉంటుంది“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2UjtSsr
Comments
Post a Comment