Skip to main content

పోస్ట్ ప్రొడక్ష‌న్ ఫైన‌ల్ ద‌శ‌లో `గాడీ నెం-143`

సాయి విజ‌య గ‌ణ‌ప‌తి పిక్చ‌ర్స్ పతాకంపై హేమంత్, సురేంద్ర , అంజ‌లి, లీజా హీరో హీరోయిన్లుగా భాను ముర‌ళి.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `గాడీ నెం-143`. ( ది ట్రావెల్ ఫ‌ర్ టైంపాస్ ల‌వ్ అండ్ ట్రూ ల‌వ్) ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ..“మా ద‌ర్శ‌కుడు భాను ముర‌ళి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో తొలిసారిగా నిర్మాత‌గా మారి `గాడీ నెం-143` చిత్రం నిర్మిస్తున్నా. ఈస్ట్ గోదావ‌రి, అర‌కు ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేసాము. మా టీమ్ స‌హ‌కారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసి మేలో ఆడియో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ద‌ర్శ‌కుడు భాను ముర‌ళి .వి మాట్లాడుతూ…“ ఒక సిన్సియ‌ర్ ల‌వ్ లోకి టైం పాస్ ల‌వ్ ప్ర‌వేశించి ఎలాంటి సంఘ‌ర్షణ రేపింది అనేది చిత్ర క‌థాంశం. చివ‌ర‌కు ఏం జ‌రిగింది అనేది ఆస‌క్తిక‌ర‌మైన ముగింపు. క‌థ, క‌థ‌నాలు చాలా కొత్త‌గా ఉంటాయి. సెన్సిబుల్ ల‌వ్, క‌డుపుబ్బ న‌వ్వించే కామెడి, హృద‌యాన్ని హ‌త్తుకునే ఎమోష‌న్స్ ఇలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులున్నాయి. యూత్, ఫ్యామిలీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేసి సినిమా అవుతుంది. ఉగాది సంద‌ర్భంగా మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్ , టీజ‌ర్ డిజిటిల్ మీడియా ద్వారా రిలీజ్ చేసాం“ అన్నారు.

గౌతంరాజు, రైజింగ్ రాజు, జాకీ, ఫ‌ణి కాంత్, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్‌, అశోక్ వ‌ర్ధ‌న్, గంగాధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః ఏసు.పి; స‌ంగీతంః త్రినాథ్ మంతెన‌; నిర్మాతః ఎమ్‌.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః భాను ముర‌ళి .వి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2OR6LmE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...