Skip to main content

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ బాయ్’

మాస్టర్ ఎన్. టి. రామ్ చరణ్ సమర్పణలో 7 వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై
తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రీమ్ బాయ్‘. రాజేష్ కనపర్తి ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. రేణుక నరేంద్ర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రీమ్ బాయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. స్టోరీ కు తగ్గ కాస్టింగ్ ను ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కంటెంట్ ఉన్న చిత్రం ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. హీరో తేజ మాట్లాడుతూ… ఇది నా ఫస్ట్ ఫిల్మ్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో పరిచయం అవుతున్నందుకు మరియు సూర్య, హేమ, ధనరాజ్ లాంటి సీనియర్ నటులతో కలసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది అన్నారు. ఇందులో 4 పాటలు ఉన్నాయి. రికార్డింగ్ అయిపోయాయి. సాంగ్స్ షూట్ మిగిలిఉంది. త్వరలో వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నామని మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ తెలిపారు. ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు మాట్లాడుతూ.. మా ప్రొడ్యూసర్ రేణుక నరేంద్ర గారు ఇంపార్టెంట్ పని ఉండడం వలన ఈ సమావేశానికి రాలేకపోయారు. మంచి కథను తెరకెక్కిస్తున్నాడు రాజేష్. షూటింగ్ పూర్తి అయింది. సాంగ్స్ ఉన్నాయి అవి వైజాగ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. మిగతా అన్నీ పనులు త్వరలో పూర్తి చేసుకొని జులై నెలలో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

తేజ, హరిణి రెడ్డి, సూర్య, హేమ, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: నాని-సుభాష్ బొంతు, లిరిక్స్: శ్రీరామ్ తపస్వి, యాక్షన్: క్రాంతి, స్క్రిప్ట్ అసోసియేటె: గంత శ్రీనివాస్, ఎడిటర్: బస్వ పైడి రెడ్డి, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, నిర్మాత: రేణుక నరేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. వీరబాబు, కథ-డైరెక్షన్: రాజేష్ కనపర్తి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2JVlY5L

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...