Skip to main content

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎస్‌విసి, జిఎంబి, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ చిత్రం ప్రారంభం

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు‘. ఈ చిత్రం ప్రారంభోత్సవం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (మే 31) అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టగా, మెగా మేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దిల్‌ రాజు సంయుక్తంగా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడికి అందించారు. ఫస్ట్‌షాట్‌ను అనిల్‌ రావిపూడి దేవుడి పటాలపై చిత్రీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ”ఈ రోజు మే 31 సూపర్‌ స్టార్‌ కృష్ణగారి పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ప్రారంభం అయ్యింది. దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి సహకారంతో అభిమానులకు, రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్‌ లో సంక్రాంతికి విడుదల చేస్తున్నాం” అన్నారు.
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”ముందుగా సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి 77వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ‘మహర్షి’ తరువాత మళ్ళీ మూడు బేనర్‌లు నాది, అనిల్‌ సుంకరగారి ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మహేష్‌ బాబుగారి జిఎంబి కలిసి నిర్మిస్తున్నాం. అనిల్‌ సంక్రాంతి 2020 అని ఆల్‌రెడీ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసారు. మనందరికీ తెలుసు 20-20 క్రికెట్‌ మ్యాచ్‌లు ఎలా ఉంటాయో. అలా సంక్రాంతికి అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి అనిల్‌ రెడీ అయ్యారు. టీం అందరికి అల్‌ ది బెస్ట్‌” అన్నారు.
యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”నా లైఫ్‌లో మోస్ట్‌ మెమొరబుల్‌ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను. డెఫినెట్‌గా ఒక మంచి హిట్‌ ఫిలిం ఇచ్చి ఆయన ఋణం తీర్చుకుంటాను. ఈ సినిమా మూడు బేనర్‌లు కలిసి ప్రొడ్యూస్‌ చేయడం హ్యాపీ. ఇక ఈ సినిమాలో మంచి కాస్ట్‌ అండ్‌ క్రూ చేయబోతున్నారు. ముఖ్యంగా విజయశాంతిగారు 13 సంవత్సరాల తరువాత ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వ బోతున్నారు. ఈ సబ్జెక్ట్‌ నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌గారు ఆర్మీ మేజర్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్‌ రష్మిక, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ తర్వాత దేవిశ్రీప్రసాద్‌ మాతో జాయిన్‌ అవుతున్నారు. దేవిశ్రీకి థాంక్స్‌. మహేష్‌గారిలో ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయి” అన్నారు.
సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి మాట్లాడుతూ – ”నా తొలి చిత్రం ‘కిలాడి కృష్ణుడు’ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ సరసన నటించే అవకాశం లభించింది. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీ” అన్నారు.
హీరోయిన్‌ రష్మిక మందన్న మాట్లాడుతూ – ”ముందుగా కృష్ణగారికి హ్యాపీ బర్త్‌డే. ఈ సినిమాలో వర్క్‌ చేయడానికి చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌కి, నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.
రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ – ”కృష్ణగారి పుట్టినరోజునే ఈ సినిమా ఓపెనింగ్‌ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ‘మహర్షి’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ఈ సినిమాలో అడుగుపెడుతున్నట్లు అన్పిస్తుంది. చాలామంది మహేష్‌గారి ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. మా హీరోకి ఒక మాస్‌ సాంగ్‌ కావాలని. మీ అందరికీ ఈరోజు చెబుతున్నాను. పార్టీ అంటే ఖచ్చితంగా ఆ పాటే పెట్టేవిధంగా ఒక మాస్‌ సాంగ్‌, అలాగే ఈ పాట పెట్టకుండా లవ్‌ చేయొద్దు అనే లాంటి ఒక లవ్‌ సాంగ్‌ చెయ్యాలని అనీల్‌గారు, నేను డిసైడ్‌ అయ్యాం. మహేష్‌గారి ఫ్యాన్స్‌ అందరికీ ఇదే నా ప్రామిస్‌” అన్నారు.
సూపర్‌ స్టార్‌ మహేష్‌,రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌ రాజు, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2MlQQiN

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...