Skip to main content

మహర్షి రివ్యూ

మహర్షి రివ్యూ
నటీనటులు : మహేష్ బాబు , అల్లరి నరేష్, పూజా హెగ్డే
సంగీతం : దేవిశ్రీప్రసాద్
నిర్మాతలు: అశ్వనీదత్ , దిల్ రాజు, పివిపి
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
రేటింగ్ : 3.5 / 5
రిలీజ్ డేట్ : 9 మే 2019

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా ?

కథ :

రిషి కుమార్ ( మహేష్ బాబు) ఓరిజిన్ సీ ఈ ఓ గా నియమితులౌతాడు . ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పైగా వ్యాపారాన్ని విస్తరించి ఉన్న ఓరిజిన్ సీ ఈ ఓ రిషి ని అభినందించడానికి రిషి కాలేజ్ స్నేహితులు అందరూ వస్తారు. కానీ పూజ ( పూజా హెగ్డే ) , రవి ( అల్లరి నరేష్) లు రారు. పూజా హైదరాబాద్ లో జాబ్ చేస్తోందని తెలుసుకుంటాడు కానీ రవి రాకపోవడానికి బలమైన కారణం ఉండటంతో పాటుగా తన జీవితం ఇలా ఉండటానికి కారకుడు రవి అని తెలుసుకున్న రిషి ఇండియాలోని రామవరం  కు వెళ్తాడు. అసలు రవికి ఏమైంది ? న్యూయార్క్ లో ఉండాల్సిన రిషి  రామవరం ఎందుకు చేరుకున్నాడు.  ఏం చేశాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

హైలైట్స్ :

మహేష్ బాబు
ఎమోషనల్ సీన్స్
అల్లరి నరేష్
నేపథ్య సంగీతం
కథ

డ్రా బ్యాక్స్ :

నిడివి

నటీనటుల ప్రతిభ :

కాలేజ్ స్టూడెంట్ గా , లీడింగ్ కంపెనీకి సి ఈ ఓ గా , రైతుగా మూడు కోణాల్లో కనిపించిన మహేష్ తన అభిమానులనే కాకుండా ప్రేక్షక లోకాన్ని సైతం మెప్పించాడు.  మహర్షి చిత్రాన్ని తన 25 వ సినిమాగా ఎంచుకొని మంచిపని చేసాడు . మహర్షి చిత్రాన్ని అభిమానులు తల ఎత్తుకునేలా , గర్వంగా చెప్పుకునేలా ఉంది ఈ 25 వ సినిమా. మూడు షేడ్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించి అద్భుతం అనిపించాడు మహేష్. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలో అల్లరి నరేష్ పాత్ర అద్భుతమే అని చెప్పాలి. చాలాకాలంగా హిట్ కోసం తపించిపోతున్న అల్లరి నరేష్ కు మంచి పాత్ర లభించింది.
దాన్ని అల్లరి నరేష్ సద్వినియోగం చేసుకున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ తో అలరించింది అయితే అంతగా నటించడానికి ప్రాధాన్యత లేకుండాపోయింది. కార్పోరేట్ విలన్ గా జగపతిబాబు మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రల్లో రావు రమేష్, సాయి కుమార్ , జయసుధ , ప్రకాష్ రాజ్ , శ్రీనివాస్ రెడ్డి , పోసాని తదితరులు తమతమ పాత్రల్లో అలరించారు.

సాంకేతిక వర్గం :

భారీ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించి తమ అభిరుచి చాటుకున్నారు అశ్వినిదత్ , దిల్ రాజు , పివిపి లు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చుని తెరమీద బాగా చూపించాడు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో రెండు మాత్రమే బాగున్నాయి. అయితే మిగతా పాటలు చూడటానికి బాగానే ఉన్నాయి. పదర పదరా అనే పాట హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి విషయానికి వస్తే…. సినిమాని గ్రాండియర్ గా చూపించాడు. మహేష్ ని మూడు గెటప్ లలో చూపించి మెప్పించాడు. రైతు సమస్యల పై మంచి కథ ని ఎంచుకొని చాలా మంచి ప్రయత్నం చేసాడు. అయితే స్క్రీన్ ప్లే లోమరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.

 

ఓవరాల్ గా :

మహేష్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా మహర్షి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2VuRFKx

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...