Skip to main content

సుడిగాలి సుధీర్‌ హీరోగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’

సుడిగాలి సుధీర్‌ హీరోగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,’రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌‘. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సయిటింగ్‌ గా అనిపించింది. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. అలాంటిది ఈ సినిమా ద్వారా వారికి మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాకే ఇంత మంది ప్రముఖ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.

ప్రొడ్యూసర్‌ కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”నేను గత 11 సంవత్సరాలుగా యుపీవిసి వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో 6 నెలల క్రితం రాజశేఖర్‌ రెడ్డి నాకు మంచి కథ వినిపించారు. అలాగే ఆయన కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గాను, హరీష్‌ శంకర్‌, సంపత్‌ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండడంతో రాజశేఖర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి ప్రొడక్షన్‌ నెం-1గా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాను నిర్మిస్తున్నాను. ఈ సినిమా ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌ లాంటి నటీనటులతో గౌతమ్‌ రాజు, రామ్‌ప్రసాద్‌, రామ్‌ లక్ష్మణ్‌, భీమ్స్‌, శేఖర్‌ మాస్టర్‌ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే యాభై శాతం టాకీ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం” అన్నారు.

దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ”మంచి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కామెడీతో పాటు కమర్షియల్‌ పంథాలో సాగే ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేటి తరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో ఉండే కష్టసుఖాలు మా సినిమాలో చూపించడం జరిగింది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కాబట్టి సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. అలాగే ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటలు చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా రెండు మోంటేజ్‌ సాంగ్స్‌. భీమ్స్‌ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు. అలాగే రామ్‌ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది” అన్నారు.

ప్రముఖ నటి ఇంద్రజ మాట్లాడుతూ – ”దర్శకుడు చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. అంతకు మించి ఒక మదర్‌ సెంటిమెంట్‌ నన్ను ఈ క్యారెక్టర్‌ చేయడానికి ప్రేరేపించింది. అలాగే దర్శకుడు కూడా సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. షూటింగ్‌ చాలా ఫన్‌గా జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌, హేమ, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌ రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌ : భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, డాన్స్‌: శేఖర్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్‌ బనిశెట్టి, ప్రొడ్యూసర్‌: కె. శేఖర్‌ రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2weBWju

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...