Skip to main content

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ‘గుర్తుకొస్తున్నాయి’ చిత్రం ప్రారంభం..

నూతన నటుడు ఉదయ్ హీరోగా ట్వింకిల్ అగర్వాల్ హీరోయిన్ గా యు ఆర్ క్రియేషన్స్ పతాకంపై రాజేష్ సి.హెచ్ దర్శకత్వంలో బంగార్రాజు నిర్మిస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ గుర్తుకొస్తున్నాయి. 1980 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ ప్రేమకథ ఇది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏప్రిల్ 22 న హైదరాబాద్ శ్రీ సత్యసాయినిగాగమం వేంకటేశ్వరస్వామి దైవ సన్నిధానంలో వైభవంగా ప్రారంభమైంది. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఉదయ్ హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాయి వెంకట్ క్లాప్ నివ్వగా వ్యాపారవేత్త శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఉదయ్, హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్, దర్శకుడు రాజేష్, సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్, సహా నిర్మాత ముత్యాల దుర్గాప్రసాద్, నిర్మాత బంగార్రాజు కెమెరామెన్ శివ పాల్గొన్నారు.

హీరో ఉదయ్ మాట్లాడుతూ.. మా దర్శకుడు రాజేష్ స్టోరీ చెప్పగానే స్పెల్ బౌండ్ అయ్యాను. నేను అంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అవి చూసి నిర్మాత బంగార్రాజు హీరో నువ్వే అనేసరికి షాక్ అయ్యాను. ఈ చిత్రంలో స్కూల్ బోయ్ గా నటిస్తున్నాను. టీనేజ్ లో జరిగే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది.. అన్నారు.

హీరోయిన్ ట్వింకిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిలిం. ఆడిషన్స్ చేసి నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు నా థాంక్స్ అన్నారు.

దర్శకుడు రాజేష్ సి.హెచ్ మాట్లాడుతూ.. చాలా సినిమాలకు నేను దర్శకత్వ శాఖలో పనిచేసాను. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను. 1980 గ్రామీణ నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. స్కూల్ డేస్ లో పిల్లలు ఎలా ఉండేవారు. అప్పట్లో ఆటలు ఎలా ఉండేవి. ఆ పిల్లలు మధ్య ప్రేమ ఎలా చిగురించేది. అన్ని విషయాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వారి తీపి జ్ఞ్యాపకాలు గుర్తుకు వచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.

నిర్మాత బంగార్రాజు మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వుంటూ సినిమాలను అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పటినుంచో ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఆ టైములో రాజేష్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కథకి మా బ్రదర్ ఉదయ్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అనిపించి హీరోగా లాంచ్ చేస్తున్నాం. పల్లెటూరి వాతావరణంలో జెరిగే స్వచ్ఛమైన, అందమైన లవ్ స్టోరీ ఇది. మే 1నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. సింగల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం అన్నారు.

సహా నిర్మాత ముత్యాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. కంస్ట్రక్షన్స్ బిజినెస్ లో వున్న నేను దేనికి డిస్టర్బ్ అవును. కానీ రాజేష్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చి చాలా డిస్టర్బ్ అయ్యాను. మనం చదువుకున్న రోజులు గుర్తుకు తెచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. అద్భుతమైన పాటలు మార్క్ ప్రశాంత్ కంపోజ్ చేసారు. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది..అన్నారు.

సంగీత దర్శకుడు మార్క్ ప్రశాంత్ మాట్లాడుతూ… మూడు పాటలు రికార్డింగ్ పూర్తి అయ్యాయి. మిగతా పాటలు చేస్తున్నాం. కథకి యాప్ట్ అయ్యేలా పాటలు ఉంటాయి. ఈ సినిమా చేస్తుండగానే మరో రెండు సినిమాలు ఆఫర్ వచ్చాయి. మా టీమ్ అంతా ఎంతో ఇన్స్పైర్ అయి ఈ సినిమా చేస్తున్నాం.. అన్నారు.

ఉదయ్, ట్వింకిల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బాబీ, పవన్ కుమార్, రఘు, రోజా చంద్రమౌళిలతో పాటు ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా; శివ.కె, సంగీతం; మార్క్ ప్రశాంత్, కో-డైరెక్టర్; రామకృష్ణ ఈనాడు, కాస్ట్యూమ్స్; నాగరాజు, మేకప్; రాజ్ కమల్, సహా నిర్మాతలు; ముత్యాల దుర్గా ప్రసాద్, జివివి సత్యనారాయణ, నిర్మాత; బంగార్రాజు, కథ-మాటలు-స్క్రీన్ ప్లై-దర్శకత్వం; రాజేష్ సి.హెచ్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2UOZyK7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...