Skip to main content

ఆంధ్రా సెంటిమెంట్ తో గెల్చినవాళ్ళు మళ్ళీ గెలుస్తారా ?

Will Andhra peoples support to EX TDP MLAsగత ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా కనిపించినప్పటికీ , గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ కి అత్యధిక స్థానాలు వచ్చాయి . తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం అత్యధిక స్థానాలు గెల్చుకొని తన సత్తా చాటింది . మొత్తంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలను గెల్చుకోగా అందులో 12 స్థానాలు గ్రేటర్ లోనివే కావడం విశేషం అలాగే టీడీపీ కి గ్రేటర్ లో ఉన్న ఓటు బ్యాంక్ ని ఇది సూచిస్తోంది . అయితే రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసు తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది . అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి దాంతో ఆంధ్రా ఓట్లు కీలకం కానున్నాయి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో .

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి చాలామంది గెలిచినప్పటికీ శేరిలింగం పల్లి ఎం ఎల్ ఏ అరికపూడి గాంధీ , జూబ్లీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాధ్ , కూకట్ పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు లు ఈసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు . అయితే గత ఎన్నికల్లో వీళ్ళు ఆంధ్రా ఓట్ల తో గెలవగలిగారు అందునా తెలుగుదేశం పార్టీ తరుపున కానీ ఈసారి టీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి గెలుస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే సెటిలర్లు వీళ్లకు ఓట్లు వేస్తేనే గెలుస్తారు లేదంటే ఓడిపోవడం ఖాయం . వీళ్ళే కాదు గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 28 నియోజకవర్గాలు ఉండగా అందులో 23 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ధేశించేది కేవలం ఆంధ్రా ఓటర్లు మాత్రమే ! వాళ్లంతా గంపగుత్తగా ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంటే వాళ్లే గెలుస్తారు లేదంటే ఓడిపోవడమే ! గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసారు కాబట్టి గెలిచారు మరి ఇప్పుడు ఎలా ఉంటుందో ? తెలుగుదేశం జెండా పట్టుకొని గెల్చిన అరికపూడి గాంధీ , మాగంటి గోపీనాధ్ , తలసాని శ్రీనివాస యాదవ్ , మాధవరం కృష్ణారావు , వివేకానంద , తీగల కృష్ణారెడ్డి , మంచిరెడ్డి కిషన్ రెడ్డి , సాయన్న , ఎర్రబెల్లి దయాకర్ రావు , చల్ల ధర్మారెడ్డి , ప్రకాష్ గౌడ్ ,రాజేందర్ రెడ్డి తదితరులంతా గులాబీ జెండా పట్టుకున్నారు . మరి ఇప్పుడు గులాబీ జెండా తో గెలుస్తారా ? ప్రజలు ఓట్లు వేస్తారా ? చూడాలి .

English Title: Will Andhra peoples support to EX TDP MLAs



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O5skis

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...