Skip to main content

30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే

30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే
30 కోట్లు: మైండ్ బ్లాక్ చేసేస్తున్న ప్రతిరోజూ పండగే

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే బాక్స్ ఆఫీస్ ప్రభంజనానికి ట్రేడ్ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. సినిమా ఫలితాలు కొన్ని అనూహ్యంగా ఉంటాయి. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కానీ వసూళ్లు అంతగా రావు, కానీ కొన్ని సినిమాలు యావరేజ్ కంటెంట్ తోనే రెచ్చిపోతుంటాయి. ప్రతిరోజూ పండగే ఇదే కోవకి చెందే చిత్రం. ఈ సినిమాకు మొదట వచ్చిన రివ్యూలకు, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం పొంతన లేదు. చాలా యావరేజ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమాకు. అన్ని రివ్యూలు చూసుకుంటే సగటున 2.75 వస్తుంది. అలాంటి ఈ చిత్రం క్రిస్మస్ సెలవుల అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని బ్రేక్ ఈవెన్ అవుతుందిలే అనుకున్నారు అందరూ. అయితే ప్రతిరోజూ పండగే రోజులు గడుస్తున్నా ఎక్కడా స్లో అవుతున్నట్లు కనిపించట్లేదు. తొలి రోజు చాలా నెమ్మదిగా తన రన్ ను మొదలుపెట్టిన ఈ చిత్రం, తొలి వీకెండ్ గడిచేసరికే హిట్ అవుతుందన్న నమ్మకాన్ని కలిగించింది. ఇక వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్లో అవ్వకపోవడంతో సూపర్ హిట్ అవుతుందని 20 కోట్లు టచ్ చేస్తుందని ఊహించారు.

అయితే క్రిస్మస్ రోజున ప్రతిరోజూ పండగే మైండ్ బ్లోయింగ్ నంబర్స్ ను నమోదు చేసింది. ఆరోజు విడుదలైన సినిమాల కంటే ఈ చిత్రం భారీ వసూళ్లు తెచ్చుకుంది. ఇక రెండో వీకెండ్ లో కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గలేదు. మొన్న న్యూ ఇయర్ రోజున అయితే తొలిరోజు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇక నిన్నటి వసూళ్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. నిన్నటితో ప్రతిరోజూ పండగే 30 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే సాయి తేజ్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం, మారుతి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ భలే భలే మగాడివోయ్ షేర్ ను అధిగమించడానికి ఎన్నో రోజులు పట్టకపోవచ్చు. సంక్రాంతి వరకూ ప్రతిరోజూ పండగే చిత్రానికి ఎదురు వచ్చే సినిమానే లేదు. దాంతో ప్రతిరోజూ పండగే 35 కోట్ల మార్క్ ను కూడా అధిగమించవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల బయ్యర్లు లాభాల బాట పట్టిన చిత్రం ఇదే అని చెప్పుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZJ1tiM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...