`ఛలో` సినిమాతో కెరీర్తో తొలి సూపర్హిట్ని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఆ సినిమా తరువాత చేసిన `నర్తనశాల` ఆకట్టుకోలేకపోవడంతో తనే రచయితగా మారి కథ సిద్ధం చేసుకుని చేసిన చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న విడుదల కానుంది. యదార్థ సంఘటనల నేపథ్యంలో అమ్మాయిల కిడ్నాపింక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ముంబైలో నాగశౌర్య ఫ్రెండ్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర లోగోని హీరో నాగశౌర్య టాటూ వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. దీని గురించి మంగళవారం నాగశౌర్య రివీల్ చేశారు. తన కెరీర్లో ఇప్పటి వరకు ఇంత ఎమోషన్, ఇంటెన్సిటీ వున్న సినిమా తాను చేయలేదని, ఈ సినిమాతో జీవితం అంటే ఏంటో నేర్చుకున్నానని, ఈ సినిమా రాయడం మొదలుపెట్టిన దగ్గరి నుంచి తన జీవితంలోని ఫైనాన్షియల్ విషయంలో కొంత మంది వుంటారని, కొంత మంది వుండరనే విషయం స్పష్టమైందని, అందుకు అంత బలమైన స్టేట్మెంట్ని ఇచ్చానని ఈ సందర్భంగా వెల్లడించారు.
తన జీవితంలో `అశ్వథ్థామ` మర్చిపోలేని సినిమా అని ఆ సెంటిమెంట్ కారణంగానే టాటూ కూడా వేయించుకున్నానని అసలు విషయం బయటపెట్టారు నాగశౌర్య. ఇటీవల సమంత విడుదల చేసిన టీజర్, దర్శకుడు పూరిజగన్నాథ్ రిలీజ్ చేపిన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. నాగశౌర్య కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఆయన నమ్మకానికి తగ్గట్టే `అశ్వథ్థామ` సక్సెస్ అవుతుందా? లేదా అన్నది తెలియాలంటే ఈ నెల 31 వరకు వేచి చూడాల్సిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3aOTt4P
Comments
Post a Comment