Skip to main content

అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట

అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట
అశ్వధాముడు వేరే హీరోలకూ పెన్ను పడతాడట

యంగ్ హీరో నాగ శౌర్య తాను నమ్మిన కథ కోసం నిర్మాతగా మారాడు. ఛలో కథలో విషయముందని పసిగట్టిన నాగ శౌర్య ఐరా క్రియేషన్స్ ను స్థాపించి ఆ సినిమాను నిర్మించాడు. అది ఎంత పెద్ద హిట్టయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ ను ఛలోకు ముందు, ఛలో తర్వాత అని విభజించుకునే తరహాలో ఛలో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత తన బ్యానర్ లోనే నర్తనశాల సినిమాను నిర్మించాడు కానీ కథ విషయంలో తన జడ్జిమెంట్ తప్పింది. అయితే తాను ఎదురుచూస్తుంటే మంచి కథలు రావట్లేదని తానే పెన్ను పట్టి నిజంగా జరిగిన సంఘటనల నుండి ఇన్స్పైర్ అయ్యి అశ్వథామ కథను రాసుకున్నాడు. ఈ సినిమాపై నాగ శౌర్య ఎక్కడలేని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమా విజయం సాధించడం తధ్యమని అంటున్నాడు.

ఇదిలా ఉంటే నాగ శౌర్య పెన్ను పట్టడం కేవలం ఈ ఒక్క సినిమాతోనే సరిపెట్టడట. ఇకపై తాను రెగ్యులర్ గా కథలు రాస్తా అంటున్నాడు. తన దగ్గర చాలానే కథలు ఉన్నాయిట. అయితే తన సినిమాలకే కాకుండా వేరే హీరోల సినిమాలకు కూడా కథలు రాసి తన బ్యానర్ లోనే నిర్మిస్తానని చెబుతున్నాడు. నిజానికి నాగ శౌర్యతో సినిమాలు నిర్మించడానికి బయట నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కథలకు కూడా లోటు లేదు అయితే శౌర్య మాత్రం తన అదృష్టాన్ని తానే రాసుకుంటానని చెబుతున్నాడు.

అశ్వథామ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న సినిమా అన్న ఫీలింగ్ కలిగించింది. యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్ హైలైట్ గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించాడు. శ్రీ చరణ్ పాకల ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అశ్వథామ హిట్ అయితేనే నాగ శౌర్య పైన చెప్పినవి జరిగే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RWQC1g

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...