డిస్కవరీ ఛానల్ కోసం గత ఏడాది ప్రధాని మోదీతో ఉత్తరాఖండ్లోని నేషనల్ పార్క్లో బేర్గ్రిల్స్ ఓ మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో మరో డాక్యుమెంటరీని షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. మంగళ, బుధ, గురువారాల్లో మైసూర్లోని బండీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో షూట్ చేయాలని బేర్గ్రిల్స్, డిస్కవరీ ఛానల్ ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.
తను నటిస్తున్న 168వ చిత్ర షూటింగ్కి బ్రేకిచ్చి మంగళవారం మైసూర్ చేరుకున్నరజనీకాంత్ ఆ తరువాత బండీపూర్ రిజర్వ్ఫారెస్ట్కి తన సిబ్బందితో కలిసి వెళ్లిపోయారు. అయితే ఈ షూటింగ్ కోసం 17 నిబంధనలు పెట్టిన కర్ణాటక ప్రభుత్వం చివరికి అనుమతినిచ్చింది. మంగళవారం షూటింగ్ మొదలుపెట్టారు. అయితే రజనీ ప్రమాద వశాత్తు కిందపడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయిని బుధవారం ఉదయం జోరుగా వార్తలు రావడం మొదలైంది.
దీంతో షాక్ కు గురైన రజనీ అభిమానులు ఏం జరిగిందా? అని ఆరాతీయడం మొదలుపెట్టారు. తన ఫ్యాన్స్ కంగారుపడతారని తెలుసుకున్న రజనీ మీడియా ముందుకు వచ్చి తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ముళ్లులు గీరుకుపోయాయని, అంతకు మించి తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించడంతో రజనీ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O7KG4l
Comments
Post a Comment