Skip to main content

2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే

2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే
2020 మెగా ఫ్యాన్స్ కు చాలా స్పెషల్.. ఎందుకంటే

అత్యధిక మంది హీరోలు కలిగిన ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. 9 మంది హీరోలకు పైగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఏడాదికి ఒక్కొక్కరు ఒక్క సినిమా చేసినా దాదాపు ఏడాది అంతా వారి సినిమాలు రిలీజైన భావన కలుగుతుంది. పైగా వరుణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కూడా ఏడాదికి రెండు సినిమాలు చొప్పున చేస్తున్నారు. 2019లో వీరిద్దరి కంబ్యాక్ చూసిన మెగా ఫ్యాన్స్ కు 2020 మరింత స్పెషల్ గా నిలవనుంది. అసలు 2020 ఆరంభమే వారికి సూపర్ హ్యాపీని ఇచ్చిందని చెప్పవచ్చు.

నా పేరు సూర్యతో ప్లాప్ కొట్టి, ఏడాది పాటు సినిమా ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోయిన అల్లు అర్జున్ ఆ బ్రేక్ కు తగ్గట్లుగా వడ్డీతో కలిపి ఇచ్చేసాడు. అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ చేసేసింది. ఇక 2020 మొత్తం మెగా ఫ్యాన్స్ కు పండగ వాతావరణాన్ని తీసుకురానుంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ ను స్టార్ట్ చేసేసాడు. మే లో ఈ చిత్రం విడుదల కానుంది. రెండు భాషల్లో హిట్ అయిన ఈ చిత్రం మూడో భాషలో కూడా హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ గతేడాది రెండు హిట్స్ కొట్టారు. ఈ ఏడాది వీరిద్దరూ సోలో బ్రతుకే సో బెటరు, బాక్సర్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవి కాకుండా వీరిద్దరి నుండి మరో రెండు సినిమాలు రానున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

సైరా చిత్రంతో విజయం అందుకున్న చిరంజీవి, కొరటాల శివతో చేసే చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ ఉంటుంది. కొరటాల శివ ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకుంటే ఈ సినిమా సక్సెస్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ ఒక హీరోగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకుడు అంటే రికార్డులు బద్దలుకావడం ఖాయం. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36yHODW

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...