Skip to main content

సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Sarileru Neekevvaru 5days Collections
Sarileru Neekevvaru 5days Collections

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకుంటోంది. మొదటి రోజే 32 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఒక ఊపు ఊపిన ఈ చిత్రం రెండో రోజు, మూడో రోజు కొంచెం తగ్గినట్లు అనిపించినా భోగి రోజున తిరిగి పుంజుకుంది. ఇక నిన్న సంక్రాంతి సందర్భంగా వసూళ్లు పీక్స్ లో నడిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రస్తుతం భారీ డిమాండ్ నడుస్తోంది. చాలా చోట్ల టిక్కెట్లు దొరక్క ప్రేక్షకులు నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.

రెండో రోజు 9.5 కోట్ల షేర్ సాధించి, మూడవ రోజు 7.21 కోట్ల షేర్ సాధించి 50 కోట్ల షేర్ మార్క్ కి చేరువైన సరిలేరు నీకెవ్వరు, భోగి అయిన నాలుగో రోజున 9 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం మళ్ళీ సంక్రాంతి నాటికి ఇంకా ఫుల్ ఫామ్ లోకి వచ్చి దాదాపు 10 కోట్ల షేర్ ను నమోదు చేసింది. దీంతో 5 రోజుల సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ 68.22 కోట్లకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 75 కోట్ల ప్రీ రిలీజ్.  అంటే ఈరోజుకి అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా డబ్బు పెట్టిన ప్రతిఒక్కరికీ నిజంగా పండగని తీసుకొచ్చింది.

ఈరోజు కూడా కనుమ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అదే స్థాయిలో పెర్ఫార్మ్ చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ ఫుల్స్ చాలా చోట్ల నమోదవడంతో ఈరోజు షేర్ కూడా 9 కోట్లకు ఇటూ ఇటూగా ఉండనుంది. ఇక ఓవర్సీస్ లో కూడా సరిలేరు బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. 1.8 మిలియన్ డాలర్స్ కు చేరువైన ఈ చిత్రం త్వరలో 2 మిలియన్ మార్క్ ను చేరుకుంటుంది.

నైజాం: 22.5 కోట్లు
సీడెడ్: 9.75 కోట్లు
గుంటూరు: 7.19 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.05 కోట్లు
తూర్పు గోదావరి: 6.22 కోట్లు
పశ్చిమ గోదావరి: 4.54 కోట్లు
కృష్ణా: 5.55 కోట్లు
నెల్లూరు: 2.42 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ: 68.08 కోట్లు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/30rweZG

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...