సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో మైండు బ్లాకు పాటలో మహేష్ బాబు లుక్కు మీద ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు & కృష్ణా గారి ఫ్యాన్స్ లో ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉంది. కెరియర్ మొదటి నుండి ఎక్కువగా సాఫ్ట్ రోల్ సినిమాలు చేస్తూ వచ్చిన, మహేష్ బాబు ఒక్క పోకిరి సినిమాలో “చూడొద్దంటున్నా… చూస్తూనే ఉంటా” అనే పాటలో తొలిసారిగా లుంగీ కట్టుకుని ఫుల్ మాస్ లుక్ లో కనిపించాడు.
ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అందరికీ తెలిసిందే. ఆతర్వాత మళ్ళీ శ్రీమంతుడు సినిమాలో కొరటాల శివ గారు కూడా, మహేష్ బాబుతో లుంగీ కట్టించాడు. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా రీలీజ్ అయిన మహర్షి సినిమాలో కూడా విలేజ్ లో కథ జరిగేటప్పుడు మహేష్ ని మాస్ లుక్ లో చూడచ్చు అనుకున్న అభిమానుల ఆశల పై డైరెక్టర్ వంశీ పైడిపల్లి నీళ్ళు చల్లాడు. పొలం దున్నే సీన్లు సైతం మహేష్ బాబు ప్యాంట్ వేసుకునే నటించాడు.
ఇప్పుడు తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి మహేష్ ని ఫుల్ మాస్ హీరోగా చూపిస్తున్నాడు. ట్రైన్ సీక్వెన్స్ లో లుంగీ తో మహేష్ కనిపించిన షాట్స్, ట్రైలర్ లో ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్న స్టిల్ “మైండు బ్లాకు” పాటలో ఉంది. ఇక ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ నుండీ విపరీతమైన అప్ల్లాజ్ వస్తోంది. ఇక ధియేటర్ లో ఈ పాటకు చొక్కాలు చించుకుంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పిన మాటలు నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి.
Waiting @urstrulyMahesh gaaru
crazy mammullllgaaaleadhu !!
Thoppppp antheeeeee
FDFS#SarileruNeekevvaruOnJan11th https://t.co/AwDdKvu3oV
— thaman S (@MusicThaman) January 6, 2020
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZShl2m



Comments
Post a Comment