Skip to main content

అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు

అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు
అమ్మ నా బత్తాయి మామూలోడు కాదు

గత రెండు రోజులుగా తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా తెలుగు నటుడు, ఎస్వీబిసి చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ గురించే వార్తలు. ఎస్వీబిసి చైర్మన్ గా ఉన్నత, గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మహిళ పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గత ఏడాది ఎన్నికల్లో యాక్టివ్ రోల్ లో కనిపించిన పృథ్వీ సేవలను గుర్తించిన జగన్, ఎస్వీబిసి చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించాడు. అయితే గత కొన్ని రోజులుగా అనవసర వివాదాల్లోకి వెళుతూ వార్తల్లో నానుతూ వస్తున్నాడు పృథ్వీ. ముందు రైతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం, తర్వాత మరో నటుడు పోసానితో తలెత్తిన వివాదం, దురుసు మాటలు.. ఈ పరిణామాలతో పృథ్వీ తీరుపై విమర్శలు వచ్చాయి. అధిష్టానం కూడా అతన్ని మందలించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే రెండు రోజుల క్రితం లీకైన ఆడియో టేప్ సంచలనం సృష్టించింది. పృథ్వీకి కట్టబెట్టిన ఎస్వీబిసి చైర్మన్ పదవి ఊడేలా చేసింది. నిన్ననే టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి జగన్ తో సంప్రదించిన అనంతరం పృథ్వీని రాజీనామా చేయమని కోరారు. దీంతో పృథ్వీకు నిన్న రాజీనామా ప్రకటించక తప్పని పరిస్థితి. ఆ ప్రకటన ప్రెస్ మీట్ లో కూడా తానే తప్పు చేయలేదని, అవసరమైతే రక్త పరీక్షలు చేయించుకోవచ్చని సవాల్ విసిరాడు కానీ దాన్ని పట్టించుకునే నాథుడు ఎవరు.

చూస్తుంటే పృథ్వీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్లు అర్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా విపక్షాలపై అతను చేస్తున్న విమర్శలు పతాక స్థాయికి చేరాయి. దీనికి తోడు ఎస్వీబిసి చైర్మన్ పదవికి పృథ్వీని పెట్టడం ఇష్టంలేని సొంత పార్టీ నేత ఈ ఆడియో లీక్ వ్యవహారం వెనుక కీలక పాత్ర పోషించినట్లు రూమర్స్ ఉన్నాయి. ఆ స్థానాన్ని ఒక మహిళకు ఇవ్వాలని ఆ నేత పట్టుబడుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలే నెగటివిటీ పెంచుకుంటున్న టైమ్ సరైనదని చెప్పి ఆ మహిళ మాటలు నిజమేననుకుని ఇతను మాట జారుతూ వచ్చాడు. ముఖ్యంగా ‘నిన్ను వెనుక నుంచి వాటేసుకుందాం అనుకున్నా.. ఎందుకో తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం’.. ‘నీతో కలిసి మందు తాగాలని ఉంది’ వంటి వ్యాఖ్యలపై అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అంటూ అందరూ దుయ్యబడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈయనపై వచ్చే మీమ్స్ కు లెక్కే లేదు. మొత్తంగా రాజకీయ చదరంగంలో తన అజాగ్రత్త, ప్రవర్తన వంటి కారణాలతో పృథ్వీ పతనమయ్యాడు. ఇప్పుడు అటు సినిమా వారికి ఇటు రాజకీయంగానూ ఎవరికీ కాని వాడుగా మిగిలిపోయాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NmcEZM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...