Skip to main content

ఓ ప‌క్క మెరుపులు.. మ‌రోప‌క్క ముద్దులు..!

ఓ ప‌క్క మెరుపులు.. మ‌రోప‌క్క ముద్దులు..!
ఓ ప‌క్క మెరుపులు.. మ‌రోప‌క్క ముద్దులు..!

`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ ఈ రోజు టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన హోట‌ల్ పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు, టి. సుబ్బిరామిరెడ్డి, డా. రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌, ప‌రుచూరి గోపాల‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. డైరీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో డా.రాజ‌శేఖ‌ర్ కార‌ణంగా ర‌సాభాస‌గా మారిన విష‌యం తెలిసిందే. తెర‌పైనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోగా వుండాల‌ని వ్య‌వ‌హ‌రిస్తుంటే కొంత మంది తొక్కేస్తున్నార‌ని డా. రాజ‌శేఖ‌ర్ స‌భాముఖంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

దీనిపై మెగాస్గార్ చిరంజీవి ఘాటుగానే స్పందించారు. మ‌న మ‌ధ్య గుట్టుగా మాట్లాడు కోవాల్సిన విష‌యాన్ని మీడియా ముఖంగా బ‌య‌ట‌పెట్ట‌డం స‌భ్య‌త కాద‌ని, ఇలాంటి పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చిరు సూచిస్తే మోహ‌న్‌బాబు మాత్రం రాజ‌శేఖ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని `మా` క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీని కోర‌డం సంచ‌ల‌నంగా మారింది. ఓ ప‌క్క వేదిక విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల మెరుపుల‌తో వేడెక్కినే వేళ .. మ‌రో ప‌క్క ముద్దుల‌తో ఆక‌ట్టుకోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ వేదిక‌పై చిరు, మోహ‌న్‌బాబు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్న దృశ్యం అంద‌రిని ఆక‌ట్టుకుంది. మోహ‌న్‌బాబుకు స‌డెన్‌గా చిరు ముద్దివ్వ‌డంతో స‌భికులంతా అవాక్క‌య్యారు.

గ‌తంలో వ‌జ్రోత్స‌వాల వేల మోహ‌న్‌బాబు, చిరంజీవి మ‌ధ్య వాగ్యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత చిరుకి ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన వేళ అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య అతిథిగా ఇండస్ట్రీ స‌త్కార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఇదే వేదిపై మాట్లాడిన మోహ‌న్ బాబు చిరుపై ప‌రోక్షంగా విమ‌ర్శిస్తూనే ఛ‌లోక్తులు విరిరారు. ఆ మాట‌ల‌కు ఆగ్ర‌హించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట‌నే మైక్ తీసుక‌ని `త‌మ్ముడూ మోహ‌న్‌బాబు` అన‌డంతో అక్క‌డి వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఆ త‌రువాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన విభేదాలు చివ‌రికి ప‌రిష్కారం కావ‌డంతో చిరుతో మోహ‌న్‌బాబు ఫ్రెండ్స్ అయిపోయారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/39xiykk

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...