Skip to main content

మాస్ మ‌హ‌రాజా డ‌బుల్ ధ‌మాకా అదిరిందిగా!

Ravi Teja double dhamaka
Ravi Teja double dhamaka

మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస ఫ్లాపుల త‌రువాత ఈ ఏడాది కొత్త పంథాలో ట్రైచేస్తున్నారు. రొటీన్ క‌థ‌ల‌తో కాకుండా కొత్త త‌ర‌హా క‌థ‌ల‌పై దృష్టిపెట్టారాయ‌న‌. గ‌త ఏడాది ఫ్లాపుల కార‌ణంగా సినిమా చేయ‌ని ర‌వితేజ 2020లో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఒకే సారి రెండు చిత్రాల్ని అందించే ప్లాన్ చేశారు. అందులో ఒక‌టి `డిస్కోరాజా`, మ‌రొక‌టి `క్రాక్‌`. ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రాలు వ‌రుస ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఆలోచ‌న‌లోప‌డిన ర‌వితేజ ఏడాది విరామం తీసుకుని రెండు చిత్రాల‌తో బ‌రిలోకి దిగారు.

`డిస్కోరాజా` రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా రెట్రో మూవీగా స‌రికొత్త క‌థ, క‌థ‌నాల‌తో వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సాగే ఈ చిత్రం 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన హీరో ర‌వితేజ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుల్ రెట్రో లుక్స్ సినిమాపై అంచ‌నాల‌ని పెంచేశాయి. త‌మ‌న్ సంగీతంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన రెండు పాట‌లు ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. న్యూ ఇయ‌ర్ రోజున ఈ సినిమా నుంచి మ‌రో లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. సిగ‌రెట్ కాలుస్తూ సీరియ‌న్‌గా క‌నిపిస్తున్న లుక్ సినిమా రివేంజ్ డ్రామాగా సాగుతుంద‌ని తెలియ‌జేస్తోంది.

ఇక ఇదే రోజు గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న క్రాక్‌` లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన లుక్‌లో పోలీస్ డ్రెస్‌లో గోలీ సోడా ప‌ట్టుకుని మాస్ రాజా ర‌వితేజ సీరియ‌స్‌గా చూస్తున్న తీరు సినిమా ఎంత సీరియ‌స్‌గా వుండ‌బోతోందో చెప్పేస్తోంది. ర‌వితేజ నుంచి ప్రేక్ష‌కులు ఎలాంటి మాస్ అంశాలు కోరుకుంటున్నారో అలాంటి అంశాల‌తో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఇలా ఒకే ఏడాది మాస్ రాజా ర‌వితేజ రెండు డిఫ‌రెంట్ మూవీస్‌తో డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. డిస్కోరాజా ఈ నెల 24న రిలీజ్ కాబోతుండ‌గా, క్రాక్ మాత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కాబోతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZEhTZN

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...