Skip to main content

మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి

మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి
మెగాహీరోతో సెటిలైన సురేందర్ రెడ్డి

దర్శకుడు సురేందర్ రెడ్డి 2019లో సైరా నరసింహారెడ్డి చిత్రంతో మంచి పేరే సంపాదించుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాన్ని, అత్యంత భారీ కాస్ట్ అండ్ క్రూను సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేసిన విధానానికి అందరూ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను బాహుబలి తరహాలో ఈ దర్శకుడు తెరకెక్కించిన వైనానికి చాలానే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మిగిలిన భాషల్లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా తెలుగులో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించి నాన్ బాహుబలి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. సైరా చిత్రంతో సురేందర్ దర్శకుడిగా మరో మెట్టు పైకి ఎక్కినట్లే. తాను కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించగలనని నిరూపించుకున్నట్లైంది.

ఇక సైరా తర్వాత సురేందర్ రెడ్డి తన తర్వాతి సినిమా ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ముందు మహేష్ బాబుతో ప్రయత్నించినా ప్రస్తుతం సూపర్ స్టార్ బిజీగా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడు. దాని తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కానీ రాజమౌళితో కానీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, మహేష్ లిస్ట్ లో లేడు. తర్వాత ప్రభాస్ తో కూడా సురేందర్ ట్రై చేసాడు. కలిసి కథ కూడా వినిపించాడు. ప్రభాస్ కు కూడా ఇప్పుడు జాన్ తర్వాత మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. జాన్ ఈ ఆగస్ట్ కు పూర్తయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమా సురేందర్ తోనే ఉండే అవకాశాలు ఉన్నాయని మీడియా కథనాలు కూడా వెల్లడయ్యాయి.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సురేందర్ తో సినిమా చేస్తాను కానీ తనకు మరో ఏడాది సమయం కావాలని, 2021లో అయితే చేయగలనని అన్నట్లు తెలుస్తోంది. దీంతో సురేందర్ రెడ్డి తన రూట్ ను మార్చుకున్నాడు. టాప్ హీరోతో కాకుండా తన లక్ష్యాన్ని మార్చుకుని యంగ్ హీరోతో వెళుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి తన తర్వాతి చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం వరుణ్, బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా కోసం సన్నద్ధమవుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అయ్యాక సురేందర్ రెడ్డితో సినిమా ఉంటుందని తెలుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ZNGZFK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...