Skip to main content

ఈ పోజుకి.. ఆ టాటూకి అర్థ‌మేంటి అమ్మ‌డూ!

ఈ పోజుకి.. ఆ టాటూకి అర్థ‌మేంటి అమ్మ‌డూ!
ఈ పోజుకి.. ఆ టాటూకి అర్థ‌మేంటి అమ్మ‌డూ!

పెళ్లి త‌రువాత స‌మంత పంథానే మారిపోయింది. సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. గ‌త ఏడాది త‌మిళంలో సూప‌ర్ డీల‌క్స్‌, తెలుగులో మ‌జిలీ, ఓ బేబీ అంటూ కొత్త త‌ర‌హా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని అందించ‌డ‌మే కాకుండా సామ్‌కి ప్ర‌శంస‌ల్ని అందించాయి. ప్ర‌స్తుతం రెట్టించిన ఉత్సాహంతో వున్న స‌మంత తెలుగులో `96`, హిందీలో `ఫ్యామిలీమ్యాన్ -2` వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఫుల్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి.

వ‌రుస షూటింగ్‌తో బిజీగా వున్నా త‌న ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఎప్పుడూ ప్ర‌త్యేకంగా టైమ్‌ని కేటాయిస్తూ వుంటుంది సామ్‌. త‌న నాటీ న‌టీ ఫొటోల‌తో ఇన్ స్టాని గిలిగింత‌లు పెట్టేస్తుంటుంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోల‌ని స‌మంత సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. లైట్ రోజ్ క‌ల‌ర్ సారీలో సామ్ సామ్ క‌నిపిస్తున్న ఫొటోలు ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ సారీలో స‌మంత మునుప‌టి క‌న్నా అందంగా జిగేల్ మంటూ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. సామ్ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ఫొటోలు ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతున్నాయి.

శ‌నివారం రాత్రి జీ సినీ అవార్డ్స్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో `సూప‌ర్ డీల‌క్స్` చిత్రానికి గానూ స‌మంత‌కు ఉత్త‌మ‌న‌టిగా స్పెష‌ల్ జ్యూరీ అవార్డు ల‌భించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాలల్గొన‌డం కోస‌మే స‌మంతా ప్ర‌త్యేకంగా ఓ డిజైన‌ర్‌తో గులాబి వ‌ర్షంలో మెరిసిపోయే సారీని డిజైన్ చేయించుకుంద‌ట‌. ఈ సారీలో త‌న అందాల‌ని త‌దేకంగా చూసి ముచ్చ‌ట‌ప‌డిన సామ్ ఆ ఫొటోల‌ని త‌న అభిమానుల కోసం ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఇందులోని ఓ ఫొటోలో సామ్ పెట్టిన పోజు, ఆమె న‌డ‌ముకున్నటాటూకి అర్థ‌మేంట‌ని అంతా సర‌దాగా కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

💓 #zeeawards #superdeluxe #vaembu #2020 🙌🤓

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Credit: Instagram



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qq4gdC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...