త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాటల మాంత్రికుడు అంటుంటారు. తన సినిమాల్లోని డైలాగులతో మాయ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ బయట ఫంక్షన్ లలో ఇచ్చే స్పీచ్ లతో కూడా అదరగొడుతుంటాడు. అందుకే మాటల మాయావి అని అతనికి పేరు. నిన్న అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్పీచ్ తో అందరినీ అలరించాడు. అసలు తన స్పీచ్ మొదలైన విధానమే ఆసక్తికరంగా అక్కడున్న వారితో పాటు లైవ్ లో ఫంక్షన్ ను వీక్షిస్తున్న వారికి కూడా తెగ నచ్చేసింది. “ఒక 10/20 రూమ్ లో, ఒక సోఫా మీద, మధ్యాహ్నం 3 -4 గంటల మధ్య అందరూ మత్తుగా భోజనం చేసి ఉంటున్న వేళలో ఒక 60 ఏళ్ల పెద్దాయనతో ఒక 30 ఏళ్ల కుర్రాడు చేసిన పాట” అంటూ సీతారామశాస్త్రికి, థమన్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఆదారహో అనే రేంజ్ లో ఉంది.
సామజవరగమన అనే సాంగ్ ఈ సినిమాకి ఎందుకంత స్పెషలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటల్లో వ్యక్తపరిచాడు. అలాగే మరోసారి సిరివెన్నెల సీతారామశాస్త్రిపై తనకున్న అభిమానాన్ని తెలియజేసాడు. బన్నీ గురించి ప్రస్తావిస్తూ జులాయి టైమ్ లో పెళ్లికాని యువకుడు, ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి.. తన అనుభవం పెరిగింది, మెచ్యూరిటీ పెరిగింది. అందుకే తనని బన్నీ అని అనను, అల్లు అర్జున్ అంటాను అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ స్థాయి గురించి మాట్లాడాడు.
సంగీతంపై తనకున్న ఇష్టాన్ని ఫన్నీగా తెలియజేసాడు. మనసు దురద పెడితే గోక్కునే ఆయుధం సంగీతం అంటూ సంగీతానికి కొత్త, వింతైన అర్ధాన్ని ఇచ్చాడు. తలలో దురద పెడితే దువ్వెన వాడతాం, సంగీతం కూడా మనసుకు దువ్వెన వంటిదే అంటూ అందరినీ నవ్వించాడు. అలాగే సంగీతాన్ని ఒక అందమైన ఆడపిల్లతో పోల్చుతూ తనకు సంగీతమంటే ఎందుకంత మక్కువో అర్ధం చెప్పాడు. తనను అడుగడుగునా ప్రోత్సహించిన నిర్మాతలకు కూడా కృతఙ్ఞతలు తెలిపాడు.
మొత్తంగా అల వైకుంఠపురములో విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపించాడు. మరి తన కాన్ఫిడెన్స్ నిజమై సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QvvoI5
Comments
Post a Comment