Skip to main content

‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!

‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!
‘డిస్కోరాజా’ హంగామా మొద‌లైందిగా!

ఏడాది విరామం త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వస్తున్నచిత్రం `డిస్కోరాజా`. `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`ఫేమ్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైంటిఫిక్ ఫిక్ష‌న్‌ రెట్రో థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ట‌చ్ చేసి చూడు. నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని వంటి వ‌రుసగా హ్యాట్రిక్ ఫ్లాప్‌లు రావ‌డంతో `డిస్కోరాజా` విష‌యంలో మాస్ మహారాజా ర‌వితేజ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

టూ డైమెన్షన్స్ వున్న పాత్రలో రవితేజ ఇందులో క‌నిపించ‌బోతున్నారు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ణ‌ణ‌గా నిలుస్తాయ‌ని, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌ల రెట్రో లుక్ ద్వారా తెలుస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇటీవ‌ల న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ర‌వితేజ్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. రిలీజ్ ద‌గ్గ‌ర‌పడుతుండ‌టంతో టీమ్ ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించ‌బోతున్నారు. దీంతో `డిస్కోరాజా` ప్ర‌మోష‌న్ హంగామా మొద‌లుకాబోతోంది. గ‌తంలో ర‌వితేజ న‌టించిన `నేల టిక్కెట్టు` చిత్రాన్ని ఇదే నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే. `డిస్కోరాజా` ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఈసారి ఎవ‌రు రాబోతున్నార‌న్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్‌గానే వుంచారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FkT23M

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...