Skip to main content

సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు సర్వం సిద్ధమైపోయింది. ఒకవైపు సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది. అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి. థియేటర్ల వద్ద ఇప్పటినుండే కటౌట్లు వెలుస్తున్నాయి. సినిమా యూనిట్ సభ్యులు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు కథ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్న విషయాన్ని ముందే ప్రకటించారు సరిలేరు టీమ్. అయితే టీజర్ చూసినా, కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెటప్ చూసినా కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఎంత సేపు ఆర్మీ మేజర్ గా ఉంటాడు, తర్వాత ఎలా కథ మారుతుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో ఉన్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. నిజానికి ఈ విషయాలను దర్శకుడు గోప్యంగా ఉంచొచ్చు. కానీ అనిల్ రివీల్ చేయడం కొసమెరుపు.

సినిమా మొదలు మహేష్ ఆర్మీ మేజర్ గానే పరిచయం కానున్నాడట. ఆ తర్వాత మహేష్ సభ్య సమాజంలోకి అడుగుపెడతాడన్నమాట. ఇక్కడ కమర్షియల్ యాంగిల్ కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెటప్ ను వాడుకున్నాడు దర్శకుడు. విజయశాంతి పాత్ర, కథలోని కీలక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అన్నీ ఇక్కడే వస్తాయని చెప్పుకొచ్చాడు. ఒక ఆర్మీ మేజర్ కు ఈ సమాజంలో సమస్య ఎదురైనప్పుడు అతను దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కీలకంగా ఉంటుందిట.

ఈ కథకు అనిల్ రావిపూడి తరహా చమక్కులు, పంచ్ లు, ప్రాసలు కలిసి సినిమా ఆద్యంతం అలరిస్తుందని అంటున్నారు. విజయశాంతి పాత్ర గురించి కొంత సస్పెన్స్ మైంటైన్ చేయడం విశేషం. అయితే మహేష్-విజయశాంతి కాంబినేషన్ లోని సీన్లు అలరిస్తాయని చెబుతున్నాడు దర్శకుడు. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37vEvOD

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...