Skip to main content

డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే

డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే
డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సర్వత్రా సరిలేరు నీకెవ్వరు కంటే బెటర్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ జోడీ హ్యాట్రిక్ సాధించడంలో సక్సెస్ అయింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ కొట్టడంలో విఫలమయ్యాడు. అజ్ఞాతవాసి చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమై చతికిలపడ్డ సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి హిట్టు కొట్టాడు. క్లాస్ గా చిత్రాన్ని ప్రెజంట్ చేస్తూనే తనదైన శైలిలో అభిమానులను అలరించే సీన్లకు కూడా ఢోకా లేకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు సీన్స్ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయిని తెలియజేస్తున్నాయి. చాలా సాధారణంగా అనిపించగల ఈ సీన్స్ ను త్రివిక్రమ్ లేపిన విధానం హైలైట్.

ముందుగా బోర్డు మీటింగ్ సీన్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. అల్లు అర్జున్.. దాదాపు అందరు స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సాంగ్స్ కు డ్యాన్స్ వేయడం.. ఆ తర్వాత వచ్చే డైలాగులు ప్రేక్షకులను కుదురుగా సీట్లో కూర్చోనివ్వవు. ఒక స్టార్ హీరో ఇలా మిగతా స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్స్ లు చేయడం నిజంగా చూడటానికి ప్రేక్షకులకు భలే థ్రిల్ ను ఇచ్చింది.

ఇక క్లైమాక్స్ ముందు వచ్చే మరో ఫైట్ కూడా త్రివిక్రమ్ ప్రతిభను తెలియజేస్తుంది. సాధారణంగా అన్ని సినిమాల్లో చూపించినట్లుగానే ఇందులో కూడా క్లైమాక్స్ కు ముందు విలన్ గ్యాంగ్ దగ్గరకు వెళ్లి వాళ్ళని కొట్టి రావాలి. హీరో వెళ్లి రౌడీలను కొట్టి రావడం చాలా సాధారణమైన విషయమే. అందుకే త్రివిక్రమ్ ఇక్కడ శ్రీకాకుళం పాట ఒకటి పెట్టాడు. ఆల్బమ్ లో రిలీజ్ చేయని ఈ పాట జనాలకు పిచ్చగా నచ్చుతోంది. సాధారణంగా ఫైట్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారు, కానీ ఇక్కడ పాటకు తగ్గట్లుగా ఫైట్ కంపోజ్ చేసారు. సినిమా పరంగా చాలా హైలైట్స్ ఉన్నా ఇవి ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TtlRU7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...