బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్ దారుణ హత్య తరువాత నుంచి నటుడు ప్రకాష్రాజ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్లున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా `జస్ట్ ఆస్కింగ్` అనే హ్యాష్ ట్యాగ్లతో సంచలన ట్వీట్లు చేస్తున్నారాయన. ఇటీవల కన్నడనాట జరిగిన ఎన్నికల్లోనూ బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమిని చవిచూశారు.
అయినా బీజేపీపై ఎదురుదాడిన ఇమాత్రం ఆపలేదు. నిత్యం ఏదో ఒక సమస్యపై బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీనీ విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వున్నారు. పదునైన ప్రశ్నల్ని సంధిస్తూనే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం సీఎఎ, ఎన్ ఆర్ సి చట్టాన్ని తీసుకురావాలని బలంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లోని యూనివర్సీటీలలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మేధావులు సైలెంట్గా వుంటే చరిత్ర క్షమించదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్రాజ్.
తాజాగా దేశ ప్రధాని మోదీపైనే వ్యంగ్యాస్త్రాల్ని సంధిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. రీ ఇన్ కార్నేషన్.. ఇలా ఎవరు చేశారు? అని ప్రశ్నిస్తూనే మోదీని హిట్లర్తో పోల్చడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సీఎఎ, ఎన్ ఆర్ సీలని బలవంతంగా దేశ ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న ప్రకాష్రాజ్ తాజాగా హిట్లర్ తరహాలో దేశాన్ని మోదీ నాశనం చేస్తున్నారనే భావాన్ని కలిగించేలా వీడియోని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ వర్గాలు ఏమని స్పందిస్తాయో చూడాలి.
RE INCARNATION…. who did this. #JustAsking pic.twitter.com/1HPbsSfAU2
— Prakash Raj (@prakashraaj) January 6, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uorZ5j
Comments
Post a Comment