Skip to main content

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ

Sarileru Neekevvaru Movie Review in Telugu
Sarileru Neekevvaru Movie Review in Telugu

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ:
నటీనటులు:  మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: అనిల్ సుంకర, మహేష్ బాబు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
విడుదల తేది: 11-01-2020
రేటింగ్: 3.5/5

సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. గత కొన్ని చిత్రాలుగా ప్యాసివ్ రోల్స్ లోనే కనిపిస్తూ వచ్చిన మహేష్ బాబు పూర్తిగా యాక్టివ్ రోల్ చేసిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఆర్మీ మేజర్ గా మహేష్ నటించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. దేశం ముందు వేరేవి ఏవీ ముఖ్యంగా కాని తనకు అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కు వెళ్లాల్సి వస్తుంది. అసలు అజయ్ కర్నూల్ ఎందుకు వెళ్ళాలి? అక్కడ తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అక్కడ కొన్ని సమస్యల్లో ఇరుక్కున్న భారతి (విజయశాంతి)కి అజయ్ అండగా ఎలా నిలిచాడు అన్నది చిత్ర కథాంశం.

నటీనటులు:
తన కెరీర్ లో చాలా తక్కువ సార్లు మాస్ రోల్ లో కనిపించాడు మహేష్. అయితే మాస్ సినిమా చేసిన సినిమాల్లో అత్యధిక శాతం హిట్లు కొట్టాడు. అయితే హీరోగా మాత్రం మహేష్ నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసాడు. డ్యాన్స్ లు కానీ, ఫైట్లు కానీ కామెడీ కానీ మహేష్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. మహేష్ ను ఇలా చూసి చాలా కాలం కావడంతో అభిమానులకు పండగే.

విజయశాంతి పాత్ర చాలా హుందాగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. కంబ్యాక్ కు సరైన సినిమా. ప్రకాష్ రాజ్ అవ్వడానికి ఇందులో విలన్ అయినా చాలా షేడ్స్ ఉన్నాయి. తన పాత్రను తీర్చిదిద్దిన విధానమే సరికొత్తగా ఉండడంతో ప్రకాష్ రాజ్ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతటా మహేష్ తోనే కనిపిస్తాడు.

సాంకేతిక నిపుణులు:
దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. మహేష్ ఇంట్రడక్షన్ సీన్, ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఫారెస్ట్ ఫైట్.. ఇలా చాలా సన్నివేశాల్లో దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. పాటల పరంగానూ దేవి మెప్పిస్తాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ ప్లస్. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మరికాస్త పదునుగా ఉంటే బాగుండేది. సినిమా లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డైలాగులు చాలా బాగున్నాయి. అనిల్ రావిపూడి సాధారణంగా పెట్టే మ్యానరిజమ్స్ దగ్గరనుండి, రాజకీయ నాయకులకు కరప్షన్ మీద క్లాస్ తీసుకునే సీన్ వరకూ చాలా చోట్ల డైలాగులు పేలాయి. కథ పాతదే అయినా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులను దృష్టిలో ఉంచుకునే తీసాడు. ఫ్యాన్స్ స్టఫ్ కోసం చాలానే సీన్లు ఉన్నాయీ సినిమాలో. దర్శకుడిగా అనిల్ రావిపూడి సంతృప్తిపరుస్తాడు. ఇంకా బాగా తీయొచ్చు అనే ఫీలింగ్ కలిగించినా మొత్తంగా చూసుకుంటే మెప్పిస్తాడు.

విశ్లేషణ:
మిలిటరీ ఎపిసోడ్ దగ్గరనుండి ట్రైన్ ఎపిసోడ్, ఇంటర్వల్ బ్లాక్ లతో ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ ఆరంభం కూడా చాలా బాగుంది. ఈ పార్ట్ మిస్ అవ్వకూడదు. ఇక మొదటి 20 నిమిషాల తర్వాత కొంత బోర్ కొట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ మైండ్ బ్లాక్ సాంగ్, విజయశాంతితో ఎమోషనల్ సీన్, సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ తో సినిమాలో ఊపు వస్తుంది. అయితే క్లైమాక్స్ ను ముగించిన తీరు మాత్రం ప్రేక్షకుల పెదవి విరుపుకు కారణమవుతుంది. మొత్తానికి సంక్రాంతి సీజన్ కు సరైన మాస్ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరు గురించి చెప్పుకోవచ్చు.

Sarileru Neekevvaru Movie Review in English



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sXxJTt

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...