Skip to main content

అత‌ను సెల్యూలాయిడ్ తాంత్రికుడు!

అత‌ను సెల్యూలాయిడ్ తాంత్రికుడు!
అత‌ను సెల్యూలాయిడ్ తాంత్రికుడు!

ఏ సినిమా ఎవ‌రిని ఎప్పుడు అంద‌లం ఎక్కిస్తుందో…ఎవ‌రిని కింద‌కి లాగేస్తుందో చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే ప్ర‌తీ శుక్ర‌వారం ఇక్క‌డ జాత‌కాలు మారిపోతుంటాయి కాబ‌ట్టి. `అజ్ఞాత‌వాసి` సినిమాతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న త్రివిక్ర‌మ్ ఇప్పుడు `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్ర‌మిది. భారీ హంగుల‌తో చ‌క్క‌ని కుటుంబ భావోద్వేగాల‌తో తెర‌పైకొచ్చిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 180కోట్లు వ‌సూలు చేసి ఇండ‌స్ట్రీ రికార్డును నెల‌కొల్సింది. నాన్ `బాహుబ‌లి` చిత్రాల వ‌సూళ్ల రికార్డుని స‌మం చేసింది. దీంతో ఆనందోత్స‌హాలు జ‌రుపుకుంటున్న చిత్ర బృందం వైజాగ్‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నిర్మాత అల్లు అర‌వింద్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సినిమా అనేది అంద‌రికంటే గొప్ప‌ద‌ని, ఇది 2020. `అల వైకుంఠ‌పుర‌ము`లో పాట‌లు 2060లోనూ వినిపిస్తాయ‌ని ప్రామిస్ చేస్తున్నా అన్నారు. శంక‌రాభ‌ర‌ణం చిత్రానికి ప‌నిచేశాన‌ని, ఆ సినిమా పాట‌లు ఇప్ప‌టికీ పాడుకుంటున్నార‌ని, అదే త‌ర‌హాలో మా సినిమా పాట‌లు కూడా వందేళ్లు వినిపిస్తాయ‌ని వెల్ల‌డించారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న చూసి క‌డుపు నిండిపోయింద‌ని, త్రివిక్ర‌మ్‌ అంతా అంటున్న‌ట్టు మాట‌ల మాంత్రికుడు కాద‌ని, ఆయ‌న సెల్యూలాయిడ్ తాంత్రికుడ‌ని, మూడు గంట‌ల సేపు త‌న మాట‌ల‌తో మాయ‌త చేశార‌ని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌కు ఇలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు త్రివిక్ర‌మ్‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అల్లు అర‌వింద్ సాధార‌ణంగా ఎవ‌రినీ పొగ‌డడ్త‌ల్లో ముంచేయ‌రు. అలాంటిది ఏకంగా త్రివిక్ర‌మ్‌ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు అన‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/369BDWE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...