Skip to main content

మామ అల్లుళ్ళు ఈ సంక్రాంతికి ప్లాప్ కొట్టినట్లేనా?

darbar and pattas negative reviews in tamilnadu
darbar and pattas negative reviews in tamilnadu

ఫిలిం ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు ఉంటారు. అయితే వాళ్ళు తమ తమ సినిమాల మధ్య తగినంత గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరితో మరొకరు పోటీకి దిగడానికి అంతగా ఇష్టపడరు. తమకంటూ ఉన్న ఫ్యాన్ బేస్ డివైడ్ అయిపోవడం ఇష్టం లేక ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు పోటీ పడటం అనివార్యమవుతుంది. అప్పుడు పోటీ ఆసక్తికరంగా మారుతుంది. గతంలో టాలీవుడ్ లో ఇలాగే బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయ్. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాన్నకు ప్రేమతో జనవరి 13న విడుదలైతే, డిక్టేటర్ జనవరి 14న విడుదలైంది.

నందమూరి అభిమానులు ఈ చిత్ర రిలీజ్ సమయంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కావాలని పోటీకి దిగకపోయినా అప్పటి పరిస్థితులకు రెండు చిత్రాలకు సంక్రాంతి రిలీజ్ అన్నది అనివార్యమైంది. నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అవ్వగా, డిక్టేటర్ ఎబోవ్ యావరేజ్ గా ఆడింది.

ఇప్పుడు మరోసారి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే అది టాలీవుడ్ లో కాదు, పక్కనున్న కోలీవుడ్ లో. రజినీకాంత్ నటించిన దర్బార్, తన అల్లుడు ధనుష్ నటించిన పట్టాస్ రెండూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డాయి. దర్బార్ 9న విడుదల కాగా పట్టాస్ 16న విడుదలైంది. సంక్రాంతి అనేది తమిళనాడు ప్రజలకు కూడా చాలా ముఖ్యమైంది, కాబట్టి ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. అయితే విచిత్రంగా ఈ రెండు సినిమాలకు కూడా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఇంకా దర్బార్ కొంచెం బెటర్, పట్టాస్ చిత్రాన్ని తమిళ రివ్యూయర్లు చీల్చి చెండాడారు. అసురన్ తర్వాత ధనుష్ నుండి ఇలాంటి చిత్రాన్ని ఊహించలేదని వాపోయారు. దర్బార్ కూడా రజినీ మేనియా తప్ప కథలో సత్తా లేదని తెలియడంతో కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. ఈ రకంగా సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వచ్చిన మామఅల్లుళ్ళు ఇద్దరూ ప్లాప్స్ అందుకున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/361SSsM

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...