Skip to main content

ట్రైల‌ర్ టాక్‌: సంక్రాంతికి బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోద్ది అంతే!

Sarileru Neekevvaru Trailer talk
Sarileru Neekevvaru Trailer talk

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న భారీ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. `ఎఫ్‌2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి నుంచి వ‌స్తున్న సినిమా ఇది. ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని ఆదివారం రాత్రి ప్రీరిలీజ్ వేడుక సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. సినిమాలో ఎంత సీరియ‌స్ కంటెంట్ వుందో అంతే స్థాయిలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌హేష్‌తో ర‌ష్మిక ఏ రేంజ్‌లో ర‌చ్చ చేసిన‌ట్టు తెలుస్తోంది. `ఎఫ్‌2`లో అంతేగా అంతేగా.. ఏ రేంజ్‌లో పేలిందో దానికి మించిన స్థాయిలో ర‌ష్మిక చెబుతున్న‌` వింటున్నావా.. డైలాగ్ థియేట‌ర్ల‌లో ఓ రేంజ్‌లో పేలబోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

చిత్ర బృందం మొద‌టి నుంచి చెబుతున్న‌ట్టుగానే ట్రైన్ ఎపిసోడ్ సినిమాలో ర‌చ్చ చేసేలాగే క‌నిపిస్తోంది. ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌హేష్‌పై ర‌ష్మిక క‌ల‌బ‌డిపోతున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. మ‌హేష్ చాలా రోజుల తరువాత త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో సినిమాలో రెచ్చిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఓ ప‌క్క యాక్ష‌న్ స‌న్నివేశాల్లో హీట్ పెంచేసిన మ‌హేష్ .. కామెడీని కూడా అదే స్థాయిలో పండించిన‌ట్టు తెలిసిపోతోంది. టోట‌ల్ సినిమా ఎలా వుండ‌బోతోందో ట్రైల‌ర్‌తోనే పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మ‌హేష్ అభిమానుల్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

ట్రైల‌ర్ చివ‌ర‌లో చిన్న బ్రేక్ ఇస్తున్నాను. త‌రువాత బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోద్ది అంటూ మ‌హేష్ చెప్పిన డైలాగ్స్‌తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా క‌నిపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి ఓ ప‌క్క సీరియ‌స్ యాక్ష‌న్‌ని అందిస్తూనే మ‌రో ప‌క్క గిలిగింత‌లు పెట్టే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుండ‌టం డ‌బుల్ ట్రీట్‌గా చెబుతున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌లో మ‌హేష్ డైలాగ్‌లు, లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి న‌ట‌న‌, ర‌ష్మిక ర‌చ్చ‌తో ఈ సంక్రాంతికి బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోద్ది అంతే అని ఫ్యాన్స్ అప్పుడే సంబ‌రాలు స్టార్ట్ చేశారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QtcDF6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...