Skip to main content

“అయిననూ పోయి రావలె హస్తినకు” – త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ

Trivikram next movie interesting title Ayinanu Poyi Raavale Hasthinaku
Trivikram next movie interesting title Ayinanu Poyi Raavale Hasthinaku

2020 సంవత్సరం మొదలు కావడం తోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న కాంట్రవర్సీ తో మొదలై, తర్వాత సంక్రాంతి బరిలో నిలిచిన రెండు పెద్ద సినిమాలు మంచి ఘనవిజయం సాధించడంతో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కళకళలాడుతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను ఆదరించారు. కానీ కొద్దిగా నిజాలు మాట్లాడుకుంటే కలెక్షన్ల పరంగా ప్రేక్షకుల అభిప్రాయాలు పరంగా “అల.. వైకుంఠపురంలో” సినిమా అగ్రస్థానంలో ఉంది.

సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అవే పాత స్క్రిప్ట్ తీసుకు వస్తాడు అని,  రొటీన్ సబ్జెక్ట్ అని రకరకాలుగా యాంటీ ఫ్యాన్స్ హంగామా చేసినా, ఒక్కసారి టికెట్ కొనుక్కొని థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు అవి గుర్తు రాలేదు. మొదటి నిమిషం నుంచి వైకుంఠపురం లోకి తీసుకెళ్ళాడు గురూజీ.  కమర్షియల్ అంశాలు జోడిస్తూనే, సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమా ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో కనుక్కొని.. దానికి తగ్గట్లు సినిమా మలిచి ప్రేక్షకుల హృదయాలను మళ్ళీ గెలిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అల వైకుంఠ పురం సినిమాలో ఆద్యంతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతకం ప్రతి ఫ్రేములో, ఆర్టిస్ట్ లు చెబుతున్న డైలాగ్స్ లో, ప్రతి టెక్నీషియన్ పనితనంలో మనకి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికలలో కూడా ఎక్కువమంది సినిమా లవర్స్ అల వైకుంఠపురం సినిమా లో ఉన్న అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. “అరవింద సమేత” సినిమా తర్వాత మళ్లీ తన సక్సెస్ ని కంటిన్యూ చేసిన గురూజీ,  ఎప్పటిలాగే సంతోషాలకు సంబరాలకు దూరంగా మళ్ళీ తన తర్వాతి సినిమా పనుల్లో మునిగిపోయాడు.

ప్రస్తుతం ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్క్రిప్ట్ లకి ఓకే చెప్పారు. మరి అన్ని రకాల ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముందుగా ఎవరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి సినిమా పేరు మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గురూజీ తన తర్వాతి సినిమాకు తన మార్క్ కి తగ్గట్టు “అయినను పోయి రావలె హస్తినకు” అనే పేరును ఫిక్స్ చేశారని అందరూ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అని,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సొంత సంస్థ లాంటి హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తారని ప్రచారం.

త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు సామాజిక అంశాలు కూడా ఇందులో ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి గురూజీ తో కలిసి ఈ స్క్రిప్ట్ లాక్ చేయించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్  ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగి గా కనబడుతూ, వ్యవస్థలో మార్పు కోసం తనవంతు ప్రయత్నం చేసే ఒక సామాజిక కార్యకర్త పాత్రలో కనబడతారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పూర్తి అయ్యి, సుకుమార్ – రామ్ చరణ్ సినిమా కూడా పూర్తయిన తర్వాత వెంటనే ఈ సినిమా ఉంటుందని సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఒక అతిథి పాత్రలో కనబడతారని కూడా అత్యుత్సాహం తో ప్రచారం చేస్తున్నారు.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో పని చేసిన గురూజీ రామ్ చరణ్ తేజ్ కి కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35UpWTK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...