స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్యాప్ వచ్చినా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. నా పేరు సూర్య ప్లాప్ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురములో చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమాకు ప్రస్తుతం ఎక్కడ చూసినా రెస్పాన్స్ అదిరిపోతోంది. ఓవర్సీస్, డొమెస్టిక్ అన్న తేడా లేకుండా ఈ సినిమాను అందరూ తెగ పొగిడేస్తున్నారు. వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. బన్నీ కెరీర్ బెస్ట్ చిత్రం అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా ఎలా సెట్ అయిందో బన్నీ వివరించాడు. త్రివిక్రమ్ తో ముందు ఈ సినిమా చేద్దామని అనుకోలేదట.
మీకు గుర్తుంటే సరిగ్గా ఏడాది క్రితం బన్నీ బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా సోను కే టిటు కీ స్వీటీ లో నటిస్తాడని బాగా ప్రచారం దక్కింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమా హక్కుల్ని తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతటితో ఆగిపోకుండా ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడని అన్నారు. అప్పట్లో ఈ వార్తలు బాగా హైలైట్ అవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని వారాలకు అల వైకుంఠపురములో చిత్ర అనౌన్స్మెంట్ జరిగింది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందిస్తూ త్రివిక్రమ్ తో చేద్దామనుకున్న బాలీవుడ్ రీమేక్ చేద్దామనుకున్న విషయం నిజమేనని అంటున్నాడు. సోను కె టిటు కీ స్వీటీ ను గీతా ఆర్ట్స్ వేరే హీరోతో చేద్దామనుకున్న ప్లాన్ ఉంది. అయితే కొంత కాలం నడిచాక అసలు నేనే ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన కలిగింది. ఈ విషయంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే మాటల మాంత్రికుడు వేరే కథతో వచ్చాడు. ఈ రెండిట్లో త్రివిక్రమ్ చెప్పిన కథే నాకు బాగా నచ్చింది. ఆ విధంగా అల వైకుంఠపురములో ప్రాజెక్ట్ సెట్ అయిందని చెప్పాడు. ఏదేమైనా ప్రస్తుతం సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తూ బన్నీ ఇమేజ్ ను మరింత పెంచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36LZk8M
Comments
Post a Comment