Skip to main content

టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?

టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?
టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?

ఇప్పుడంతా ఎక్కడ చూసినా హంగామా మొత్తం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల చుట్టూనే ఉంది. మరో మూడు రోజుల్లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ఒక రోజు తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సందడి చేయనుంది. ఈ రెండు చిత్రాలు చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా మరొకటి మాస్ ను టార్గెట్ చేసిన చిత్రం, అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ సినిమా చేసి, ఇటు మహేష్ బాబు మాస్ ఎంటర్టైనర్ చేసి చాలా సినిమాలైంది. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో కూడా భారీ తారాగణం నటించింది. అయితే వీరిలో ఆసక్తి రేకెత్తించింది ఇద్దరు. వారే విజయశాంతి, టబు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది విజయశాంతి, అలాగే టబు అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ భార్యగా కనిపించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై తిరిగి మెరవనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరి పాత్ర బాగుంటుంది అన్నదానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

విజయశాంతి ప్రొఫసర్ భారతి పాత్రలో సరిలేరు చిత్రంలో నటించింది. సినిమాకు కీలకమైన పాత్రగా ఇది ఉండనుందని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుందిట. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పాత్ర తరహాలో ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఇక మరోవైపు అల వైకుంఠపురములో చిత్రంలో టబు పాత్రకు అంత ప్రాధాన్యత లేదని అర్ధమవుతోంది. ట్రైలర్ లోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ తల్లిగా, జయరామ్ భార్యగా టబు ఒక ఫ్యామిలీ పర్సన్ తరహాలో ఈ చిత్రంలో కనిపించనుందని సమాచారం. ఆమెకు స్క్రీన్ టైమ్ బాగానే ఉన్నా ఆమె చుట్టూ తిరిగే పాత్రయితే కాదు.

పాత్ర పరంగా విజయశాంతికి ప్రాధాన్యత ఎక్కువుంటుంది కాబట్టి వీరిద్దరి మధ్యన పోలిక పెట్టడం అన్నది సమంజసం కాదనేది పలువురి అభిప్రాయం. సినిమాలు రెండూ విడుదలయ్యాక ఎవరి పాత్ర ఎలాంటిదో తేలిపోతుంది. అప్పుడు క్లియర్ గా మాట్లాడుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35vAVTu

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...