Skip to main content

దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?

దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?
దిల్ రాజు.. సైలెంట్ గా ఉంటున్నాడేంటి?

దిల్ రాజు.. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్. ఆ నలుగురుగా ఇండస్ట్రీలో పేర్కొనబడే వ్యక్తుల్లో దిల్ రాజు కూడా ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా దిల్ రాజు ప్రయాణం ఎత్తుపల్లాలు ఉన్నా సాఫీగానే సాగిపోయిందని చెప్పాలి. దిల్ రాజు సినిమాలంటే మినిమం గ్యారంటీ అనే ఒపీనియన్ జనాల్లో బాగా నాటుకుపోయింది. ఆయన జడ్జ్మెంట్ ఆన్ ది స్పాట్ గా ఉంటుందని ఇండస్ట్రీలో పేరుంది. దిల్ రాజు మొదట్లో ఎక్కువగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. నిజానికి దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చేది కూడా అవే. కానీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఈయన పెద్ద సినిమాలపై ఆసక్తి చూపిస్తుంటాడు. పెద్ద సినిమాలైతే ఇండస్ట్రీపై తనకు గ్రిప్ ఉంటుందన్నది దిల్ రాజు భావన. అందుకే ఏడాదికి ఒక్కటైనా పెద్ద సినిమా నిర్మిస్తుంటాడు.

అయితే ఈ మధ్య దిల్ రాజు కొంచెం డల్ అయినట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలు చేస్తున్నా అందులో డైరెక్ట్ భాగస్వామ్యం లేదు. అందుకే అవి దిల్ రాజుకు పూర్తి సంతృప్తిని ఇవ్వట్లేదు. ఈ మధ్య సినిమాలన్నీ ఎక్కువగా భాగస్వామ్యంతో తెరకెక్కుతున్నవే ఉంటున్నాయి. దీని వల్ల నిర్మాతలకు రిస్క్ తగ్గుతుందన్నది వారి భావన. ఇదిలా ఉంటే చిన్న సినిమాలు కూడా దిల్ రాజు ఆశించిన రేంజ్ లో సక్సెస్ కావట్లేదు. ఈ నేపథ్యంలో దిల్ రాజు రీసెంట్ గా నిర్మించిన సినిమా ఇద్దరి లోకం ఒకటే. రాజు తరుణ్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తి చేసారో కూడా తెలీదు. అంతా గుట్టుగా జరిగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది.

సెన్సార్ అయితే అయింది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. క్రిస్మస్ రోజున విడుదల చేద్దామని ముందు భావించాడు దిల్ రాజు. డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు విడుదలవుతున్నా ఐదు రోజులు గ్యాప్ ఉంటుంది పైగా న్యూ ఇయర్ ఈవ్ కూడా కలిసొస్తుందని డిసెంబర్ 25 పెర్ఫెక్ట్ అనుకున్నాడు. అయితే ఇప్పుడు అదే రోజున వెంకీ మామ విడుదలవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. మూడు క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలైతే ఇద్దరి లోకం ఒకటే వంటి చిన్న సినిమా రావడానికి స్కోప్ ఉండదు. అందుకే డిసెంబర్ 13 అయినా విడుదల చేద్దామా అని అనుకుంటున్నాడు.

రిలీజ్ డేట్ సంగతి పక్కనపెడితే దిల్ రాజు ఈ సినిమాకు కనీస ప్రమోషన్ కూడా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ పాటలు విడుదలైనా అవి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినా కానీ ఇంకా ప్రమోషన్స్ ఏ మాత్రం లేకపోవడం టీమ్ కు ఆందోళన కలిగిస్తోంది. దిల్ రాజు అంటే ప్రమోషన్స్ కు పెట్టింది పేరు. మరి రాజ్ తరుణ్ సినిమా విషయంలో ఎందుకిలా జరుగుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OFm3gd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...