స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా సూపర్బ్ బజ్ ను క్యారీ చేస్తోంది. ఈ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అందరూ చాలా ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉంది. న్యూ ఇయర్ వేడుకలకు బన్నీ తన కుటుంబంతో సహా ఫారిన్ ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే. అంతకంటే ముందు ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ జనవరి 6న హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ చిత్రంలోని పాటలను, బన్నీ-థమన్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సూపర్ హిట్ పాటలను థమన్ అండ్ కో లైవ్ గా పెర్ఫార్మ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈ ఈవెంట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మ్యూజికల్ కన్సర్ట్ కు తారక్ చీఫ్ గెస్ట్ గా వస్తాయని వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి.
అల వైకుంఠపురములో చిత్రానికి పోటీగా విడుదలవుతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలవడంతో అల వైకుంఠపురములో టీమ్ కూడా తారక్, పవన్ లలో ఎవరో ఒకర్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం జరగట్లేదని ఇప్పుడు తెలుస్తోంది. ఈ మ్యూజికల్ కన్సర్ట్ కు ముఖ్య అతిధులు అంటూ ఎవరూ లేరు. అల వైకుంఠపురములో టీమ్ మాత్రమే పాల్గొననుంది. మరి ఈ మూవ్ ఎంతవరకూ చిత్రానికి ప్లస్ అవుతుందో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36ej1FR
Comments
Post a Comment