Skip to main content

ఒకేసారి ఇద్ద‌రు డేట్‌కి పిలిచార‌ట‌!

ఒకేసారి ఇద్ద‌రు డేట్‌కి పిలిచార‌ట‌!
ఒకేసారి ఇద్ద‌రు డేట్‌కి పిలిచార‌ట‌!

బాలీవుడ్‌లో డేటింగ్‌లు, ల‌వ్‌స్టోరీలు, బ్రేక‌ప్‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో జంట‌లు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఆ త‌రువాత బ్రేప్ చెప్పుకున్న సంద‌ర్భాలు ఎన్నో వున్నాయి. ఈ మ‌ధ్య డేట్‌కి వెళ్ల‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింది. ఈ జాబితాలో హీరోయిన్ రాధికా ఆప్టే కూడా చేరింది. బోల్డ్ పాత్ర‌ల్లో కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డి బాలీవుడ్ క‌థానాయిక‌ల‌ని కంగారెత్తించిన రాధికా ఆప్టే గ‌త కొంత కాలంగా వ‌రుస వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల టాలీవుడ్ హీరోలు, నిర్మాత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రాధికా ఆప్టే కూడా డేట్ కి వెళ్లింద‌ట‌.

త‌న డేట్‌కి సంబంధించిన సీక్రెట్‌ని తాజాఆ బ‌య‌ట‌పెట్టింది. అయితే ఒకే సారి త‌న‌ని ఇద్ద‌రు డేట్‌కి పిలిచార‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. త‌న‌ని ఒకేసారి ఇద్ద‌రు డేట్‌కి పిలిచార‌ని ఆ స‌మ‌యంలో ఏం చేయాలో అర్థం కాలేద‌ని చెబుతోంది రాధికా ఆప్టే. 2012లో లండ‌న్‌కు చెందిన మ్యుజీషియ‌న్‌ని పెళ్లాడిన రాధికా ఆప్టే త‌న పెళ్లికి ముందు జరిగిన ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ని తాజాగా గుర్తు చేసుకుంది. బెన‌డిక్ట్‌ని పెళ్లాడే స‌మ‌యానికి ముందు ఇద్ద‌రు త‌న‌ని డేట్‌కి పిలిచార‌ని, అయితే త‌న‌ని డేట్‌కి పిలిచిన వాళ్ల‌లో బెనెడిక్ట్ కూడా వున్నాడ‌ని, ఇద్ద‌రిలో ఎవ‌రితో డేట్‌కు వెళ్లాలో తెలియ‌ని సందిగ్ధంలో వున్న త‌ను త‌న స్నేహితురాలి స‌హాయం తీసుకుని ఓ చిన్ని టెస్ట్ పెట్టుకున్నాన‌ని తెలిపింది.

త‌ను వండిన టూనా చేప‌ని పిల్లి తింటే బెనెడిక్ట్‌తో డేట్‌కి వెళ్లాల‌ని లేక‌పోతే మ‌రో వ్య‌క్తితో వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, త‌న అదృష్టం కొద్ది టూనా చేప‌ని పిల్లి తింద‌ని, దాంతో బెనెడిక్ట్‌తోనే తాను డేట్‌కి వెళ్లాన‌ని, త‌రువాత అత‌న్నే వివాహం చేసుకున్నాన‌ని త‌న డేట్ వెన‌కున్న అస‌లు సీక్రెట్‌ని ఈసంద‌ర్భంగా బ‌య‌ట పెట్టింది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PYcBFc

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...