Skip to main content

సరిలేరు నీకెవ్వరులో హైలైట్ పాయింట్ అదే అంటున్నారే!

Highlight episode in Sarileru Neekevvaru revealed
Highlight episode in Sarileru Neekevvaru revealed

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో నుండి డైరెక్ట్ పోటీ ఉన్న కారణంగా సరిలేరు నిర్మాతలు ప్రమోషన్స్ ను మరో లెవెల్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, నాలుగు పాటలు విడుదల కాగా అన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసిన సంగతి అర్ధమవుతోంది. అలాగే కామెడీ కూడా హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.

అనిల్ రావిపూడి గత నాలుగు సినిమాలు గమనిస్తే కామెడీనే మెయిన్ హైలైట్. రొటీనే అయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఎక్కడా తగ్గడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా కామెడీని మెయిన్ హైలైట్ గా ప్రోజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కేవలం కామెడీనే కాకుండా ఈ సినిమాలో మరో హైలైట్ అంశం కూడా ఉందట. అదే సెంటిమెంట్. ఇందులో ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ వర్గం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా విజయశాంతి-రాజేంద్ర ప్రసాద్-మహేష్ బాబు త్రెడ్ బాగా వర్కౌట్ అవుతుందని, ఫ్యామిలీ ప్రేక్షకులను ఈ ఎపిసోడ్ బాగా అలరిస్తుందని అంటున్నారు.

అనిల్ రావిపూడి సినిమాల్లో కామన్ కనిపించే ఫ్యాక్టర్.. ఫస్ట్ హాఫ్ వరకూ పైసా వసూల్ లా నడిపించే అనిల్, సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం చేతులెత్తేస్తుంటాడు. కానీ అతని సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. అందుకే ఈసారి ఇందులో ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దడానికి కష్టపడుతున్నాడు అనిల్ రావిపూడి.

మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ లో కనిపించనున్న సంగతి తెల్సిందే. అలాగే ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ హైలైట్స్ అన్నీ వర్కవుటై సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EVIGHr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...