Skip to main content

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు
ఫ్యాన్స్ కి దండం రా బాబూ.! అంటున్నదర్శకుడు

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ “తెలుగు ఫ్యాన్స్ ని అంచనా వేయలేం.” అని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న దర్బార్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. మహేష్ బాబు తో తాను చేసిన స్పైడర్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోవడానికి కారణం; తాను తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాని తియ్యడమే” అని అన్నారు.

స్పైడర్ సినిమా లో ప్రధానంగా తాను మహేష్ బాబును తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా తీశానని అంతే తప్ప తెలుగు ప్రేక్షకులను, అందులోనూ మహేష్ బాబు అభిమానుల అంచనాలు – అభిరుచులను తాను పట్టించుకోలేదని అందువల్లనే ఆ చిత్రం ఘోర పరాజయం పాలైందని; అందుకు తాను ఎంతో బాధపడుతున్నానని మురుగదాస్ విచారం వ్యక్తం చేసారు. ఇది తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మురుగదాస్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పాన్ ఇండియా లెవెల్ లో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ, సూపర్ హిట్ లు ఇస్తున్న మురుగదాస్ మహేష్ ఇమేజ్ కి మాత్రం తగిన కథను సెలెక్ట్ చేసి సినిమా గా తీయలేకపోయాడు.. అని తెలుగు ప్రేక్షకుల టేస్ట్ తెలియనప్పుడు ఎందుకు తెలుగులో సినిమా చేశాడని.? సోషల్ మీడియా అడ్మిన్ పేజీల వేదికపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా కూడా సంక్రాంతి ఈ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటంతో ఈ రెండు సినిమాల మధ్య అనుకోని విధంగా పోటీ నెలకొంది. అందువల్లనే కొంత మంది మురుగదాస్ అభిప్రాయాన్ని వక్రీకరించారని కొంతమంది సినిమా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబుకు మొదటి నుంచి తమిళ దర్శకుల సెంటిమెంట్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య తో ఆయన చేసిన నాని సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత అదే ఎస్.జె.సూర్య “స్పైడర్” సినిమా లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత నేటి వరకు మహేష్ బాబు మళ్లీ తమిళ దర్శకులు జోలికి వెళ్ళలేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2F98b88

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...