Skip to main content

2019 లో తెలుగులో దిగిన కొత్త పాపలు

Tollywood New Heroines in 2019
Tollywood New Heroines in 2019

ప్రకృతి ధర్మం ప్రకారం సినిమాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులోనూ తెలుగులో ఏంటంటే, హీరో ని బాబు అని పిలవాలి. ఇక పాపల విషయానికి వస్తే (మరి హీరోలను “బాబు” అని పిలిచినప్పుడు; హీరోయిన్స్ ని అలాగే పిలవాలి కదా.!) ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా ఎంతో మంది సినిమా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా తక్కువమంది తెరపై కనపడతారు. ఇక 2019 లో తెలుగు తెరకు అరంగేట్రం ఇచ్చిన హీరోయిన్స్ లో సక్సెస్ అయిన వాళ్ళను   ఒక్కసారి గమనిస్తే,

శివాత్మిక రాజశేఖర్ : హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే ఈమె కూడా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దొరసాని సినిమా చూసిన వారందరూ శివాత్మిక భవిష్యత్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్తున్నారు.

దివ్యంశ : నాగచైతన్య & సమంత కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సినిమాలో నాగచైతన్య లవర్ గా ఈమె నటించింది. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఆఫర్లు సాధిస్తోంది.  ఇక యూత్ మజిలీ సినిమాలో ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు

అనన్య : ఆసు మిషన్ కనిపెట్టిన గొప్ప వ్యక్తి చింతకింది మల్లేశం గారి బయోపిక్ మల్లేశం సినిమాలో ప్రియదర్శి సరసన అమాయకురాలైన భార్య పాత్ర లో అనన్య ఒదిగిపోయింది. ఇక ఆమె లోని చలాకీతనం అంతా రాబోయే సినిమాలలో మనకు కనపడుతుంది. ఈ సినిమాకు ప్రియదర్శి తరువాత మంచి పేరు వచ్చింది తనకే.

అనఘా : హీరో కార్తికేయ నటించిన “గుణ 369” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అనఘా. ఇక ఈ సినిమా తరువాత నుండి ఆమెను యూత్ “బుజ్జి బంగారం” అంటూ కలవరిస్తున్నారు. తన సహజమైన నటన మరియు అందాలతో అనఘా టాలీవుడ్ లో గట్టి ముద్ర వేసింది

ఇక వీరితోపాటు సాహో లాంటి పెద్ద సినిమాతో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాని “గ్యాంగ్ లీడర్” సినిమాతో ప్రియాంక ఆరుళ్ మోహన్; ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో “శృతి శర్మ” ; మీకు మాత్రమే చెప్తా సినిమాతో వాణీ భోజన్; సందీప్ కిషన్ థ్రిల్లర్ మూవీ “నిను వీడని నీడను నేనే” సినిమాతో “ఆన్య సింగ్”;  అటు ఆడియెన్స్ కి ఇటు ఇండస్ట్రీ కి గట్టిగా రిజిస్టర్ అయ్యారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QsOjCb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...