Skip to main content

బన్నీ మరొకటి సెట్ చేసే పనిలో పడ్డాడుగా!

బన్నీ మరొకటి సెట్ చేసే పనిలో పడ్డాడుగా!
బన్నీ మరొకటి సెట్ చేసే పనిలో పడ్డాడుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో సందిగ్దత ఎదుర్కొని చివరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేసాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న విషయం తెల్సిందే. అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది పాటు సినిమా మొదలుపెట్టకుండా జాప్యం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు వరసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.

అల వైకుంఠపురములో షూటింగ్ లో ఉన్న సమయంలోనే బన్నీ రెండు సినిమాలను ప్రకటించాడు. ఒకటి సుకుమార్ దర్శకత్వంలో సినిమా, మరొకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్. ముందుగా సుకుమార్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్న క్రమంలో ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీని తర్వాత ఐకాన్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే బన్నీ అల వైకుంఠపురములో పూర్తైన వెంటనే మరో సినిమాను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాడట. అందుకే దర్శకుల దగ్గర కథలు వింటున్నట్లు అల్లు అర్జున్ దగ్గర సన్నిహితులు చెబుతున్నారు. ఏ ఆర్ మురుగదాస్ సహా మరికొంత మంది దర్శకుల దగ్గర కథలు వింటున్నది బన్నీ. వారిలో హరీష్ శంకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మురుగదాస్ ఇటీవలే తెలుగు హీరోల గురించి స్పందించాడు. దర్బార్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తాను తెలుగు హీరోల ఇమేజ్ ను తప్పుగా అర్ధం చేసుకున్నానని, ఇక్కడ ఆడియన్స్ పల్స్ ను పట్టుకోవడంలో విఫలమయ్యానని, త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అర్ధం చేసుకుంటానని అన్నాడు. దీని వెనుక అర్ధం అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లేనని ఇప్పుడు కొంత మంది వాదిస్తున్నారు. ఇద్దరూ హైదరాబాద్ లో ఇటీవలే కలవడం ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చింది. మరి మురుగదాస్, హరీష్ శంకర్ లలో బన్నీ అవకాశం ఎవరికి ఇస్తాడో లేదా మరో దర్శకుడితో చేయాలనుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చెయ్యక తప్పదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36eGYNh

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...