Skip to main content

దిల్ రాజు ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టేశాడేంటి?

No promotions for Iddari Lokam Okate post release
No promotions for Iddari Lokam Okate post release

దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలుంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు, కనీస స్థాయి ఎంటర్టైన్మెంట్ ఆశించే సినిమాలు దిల్ రాజు బ్రాండ్ నుండి వస్తుంటాయి. దిల్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన రాజు, చాలా తక్కువ కాలంలోనే దిల్ రాజు అనే బ్రాండ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరుచుకున్నాడు. చాలా తక్కువ మంది నిర్మాతల్ని పేరు చూసి సినిమాలకు వస్తుంటారు. వాళ్లలో దిల్ రాజు కూడా ఒకరు. అయితే ఈ మధ్య ఆ బ్రాండ్ నేమ్ మసకబారిందనేలా విడుదలైన కొన్ని సినిమాలు ఆశించిన రేంజ్ లో ఆడలేదు. ఇటీవలే విడుదలైన ఇద్దరి లోకం ఒకటే సినిమా అయితే ఇది అసలు దిల్ రాజు సినిమానేనా అన్న సందేహాలు కలిగించింది.

దిల్ రాజు అంటే ఉండే కనీస స్థాయి ప్రమాణాలు కూడా ఈ చిత్రానికి లేవు. చెప్పుకోవడానికంటూ ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేకపోవడం గమనార్హం. అటు ఇండస్ట్రీ, ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా దిల్ రాజు నుండి ఇటువంటి సినిమాను ఊహించలేదు. అందుకే ప్రేక్షకులు తొలి ఆట నుండే దీన్ని తిరస్కరించారు. అయితే సినిమా అన్నాక మినిమం ప్రమోషన్లు చేయడం పరిపాటి. సినిమా విడుదలైన సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి తక్కువ రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు రాసే వాళ్ళని చెడమెడ తిట్టేయడం పరిపాటిగా మారింది.

అయితే ఇద్దరి లోకం ఒకటే విషయంలో ఇలాంటిదేం జరగలేదు. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లు చాలా తక్కువ స్థాయిలో జరిగాయి. కనీస స్థాయిలో టివిలో యాడ్ లు వేయలేదు. పేపర్స్ లో ప్రింట్స్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా హడావిడి తక్కువే. ఇక రిలీజ్ అయ్యాక అవి పూర్తిగా తగ్గిపోయాయి. ఒకవైపు వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, మత్తు వదలరా వంటి సినిమాలు జోరు చూపిస్తుంటే పోటీ తట్టుకోవడం కోసమైనా కనీసం ఏదొకటి చెప్పి దిల్ రాజు సినిమా ప్రమోట్ చేయవచ్చు కానీ ఆ రూట్ ను అతను ఎంచుకోలేదు. ఓటమిని ఒప్పుకున్నట్లున్నాడు. అందుకే ఏం చెప్పి సినిమాను చూడమనాలో తెలియక సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దిల్ రాజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tXf8qx

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...