Skip to main content

దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!

దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!
దీపికాక‌ప‌దుకునేకు షాకిచ్చిన‌ కంగ‌న సిస్ట‌ర్‌!

బాలీవుడ్‌లో రెబ‌ల్ సిస్ట‌ర్స్‌గా కంగ‌న ర‌నౌత్‌, రంగోలి చందేల్‌కు పేరుంది. ఈ ఇద్దరిలో ఎవ‌రిని విమ‌ర్శించినా మ‌రొక‌రు విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా కంగ‌న ర‌నౌత్‌ని విమ‌ర్శిస్తే మాత్రం రంగోలి రంగంలోకి దిగి ర‌ఫాడించేస్తుంది. అందుకే బాలీవుడ్‌లో ఎవ‌రూ వీళ్ల‌ని విమ‌ర్శించడానికి సాహ‌సించ‌రు. గ కొంత కాలంగా కంగ‌న కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తోంది ఆమె సిస్ట‌ర్ రంగోలి చందేల్‌. కంగ‌న‌ని ఎవ‌రు టార్గెట్ చేసినా వారిపై విరుచుకుప‌డుతూ బాలీవుడ్‌లో గత కొంత కాలంగా రంగోలి వార్త‌ల్లో నిలుస్తొంది. ఇటీవ‌ల `సాండ్ కీ ఆంఖ్‌` సినిమా విష‌యంలో తాప్సీని టార్గెట్ చేసిన రంగోలి వ‌రుస ట్వీట్‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిపిందే.

అలాంటి రంగోలి తొలిసారి దీపికా ప‌దుకోన్‌పై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించ‌డం బాలీవుడ్ శ్రేణుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది. దీపిక న‌టించిన తాజా చిత్రం `ఛ‌పాక్‌`. మేఘ‌నా గుల్జార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ య‌దార్థ గాధ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో మాల‌తిగా యాసిడ్ దాడికి బ‌లైన యువ‌తిగా న‌టిస్తోంది. ఆ మ‌ధ్య రిలీజ్ చేసిన దీపిక ఫ‌స్ట్‌లుక్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో దీపిక ప్ర‌ద‌ర్శిన న‌ట‌న విమ‌ర్శ‌కుల‌ని సైతం ఆక‌ట్టుకుంటోంది. దీంతో దీపిక‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ ట్రైల‌ర్‌లో దీపిక లుక్‌, న‌ట‌న చూసిన కంగ‌న సిస్ట‌ర్ రంగోలి చందేల్ `వాహ్ అద్భుతం అంటూ కితాబిచ్చింది. `ఈ సినిమా ద్వారా మేఘ‌నా గుల్జార్‌, దీపికా ప‌దుకోన్ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటార‌ని, యాసిడ్ దాడి త‌రువాత నేను, నా కుటుంబ ఎంత‌టి న‌ర‌కాన్ని అనుభ‌వించామో ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని, యాసిడ్ దాడికి గురైన ఓ యువ‌తి ఎలాంటి న‌ర‌క‌యాత‌న‌ను అనుభ‌వించిందో ఈ లోకానికి తెలియాల‌ని, అంతా ఈ చిత్రాన్ని చూడాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని` ట్వీట్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rzzNAb

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...