Skip to main content

చిన్మ‌యి మొత్తానికి సాధించేసింది!

చిన్మ‌యి మొత్తానికి సాధించేసింది!
చిన్మ‌యి మొత్తానికి సాధించేసింది!

దేశ వ్యాప్తంగా `మీటూ` వివాదం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దీని కార‌ణంగా ఎంతో మంది న‌టులు సినిమాల నుంచి అర్థాంత‌రంగా త‌ప్పుకున్నారు. అదే స్థాయ‌లో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా త‌మ ప‌ద‌వుల్ని పోగొట్టుకున్నారు. ఉత్త‌రాది వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఈ సంఘ‌ట‌న‌లు ద‌క్షిణాదిలోనూ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్‌లో శ్రీ‌రెడ్డి మీటూ వివాదంపై చేసిన ర‌చ్చ ప్ర‌కంప‌న‌ల్ని సృష్టించింది. న‌డి వీధిలో బ‌ట్ట‌లు విప్పి అర్థ‌న‌గ్నంగా శ్రీ‌రెడ్డి హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో ఉమెన్ హెరాస్ మెంట్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యే క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో వివాదం కొంత చ‌ల్లారింది.

గ‌త కొన్ని నెల‌లుగా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ మీటూ ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తు గ‌త కొంత కాలంగా 12 మంది సింగ‌ర్స్‌ని సెక్సువ‌ల్‌గా హెరాస్ చేశాడ‌ని, వారిని మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాడ‌ని, త‌న‌ని కూడా హెరాస్ చేశాడ‌ని గాయ‌ని, డ‌బ్బింగ్ క‌ళారారిని చిన్మయి చేసిన వ్యాఖ్య‌లు త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌తో పాటు టాలీవుడ్‌లోనూ సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ మాట‌ల్ని తాజాగా సీరియ‌స్‌గా తీసుకున్న `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` మేక‌ర్స్ త‌మ ప్రాజెక్ట్ నుంచి అత‌న్ని త‌ప్పించిన‌ట్టు తాజా స‌మాచారం. ఇదే నిజ‌మైతే మీటూ కార‌ణంగా సినిమా కోల్పోయిన తొలి ద‌క్షిణాది క‌ళాకారుడిగా వైర‌ముత్తు రికార్డుల్లోకి ఎక్క‌డం ఖాయ‌మ‌ని త‌మిళ వర్గాలు అంటున్నాయి.

ఇక వైర‌ముత్తు `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` నుంచి త‌ప్పుకోవ‌డం లాంఛ‌న‌మే అయితే అత‌నిపై కొన్ని నెల‌లుగా ఒంట‌రి పోరాటం చేస్తున్న గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి విజ‌యం సాధించిన‌ట్టే. అయితే దీనిపై ఇంకా సినీ వ‌ర్గాలు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ర‌చ‌యిత‌ల సంఘం మాత్రం ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంద‌ని మాత్రం త‌మిళ చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35D9Hes

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...