Skip to main content

పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?

పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?
పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?

గత కొద్ది కాలంగా కన్ఫ్యూజన్ లో పడిపోయిన పింక్ రీమేక్ వార్తలకు ఇప్పుడు మళ్ళీ ఊపొచ్చింది. పవన్ కళ్యాణ్ లేకపోయినా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అధికారికంగా ఈ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్న థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ సినిమాలో పాటలకు అంత ప్రాముఖ్యత ఉండదు. ఒరిజినల్ లో అయితే ఒకటే పాట ఉంటుంది, అది కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్. కానీ ఈ సినిమాకు రీరికార్డింగ్ చాలా ముఖ్యం. అందుకే థమన్ కు దిల్ రాజు అండ్ కో ఓటేసినట్లు సమాచారం.

అయితే ఇలా అధికారిక ప్రకటన వచ్చిందో లేదో, వెంటనే ఈ సినిమాలో నటించే హీరోయిన్లు వీళ్ళే అంటూ రకరకాల పేర్లు వినిపించడం మొదలుపెట్టాయి. సమంత ఇందులో తాప్సి రోల్ చేస్తోందని ఒకరు, కాదు పూజ హెగ్డే అని మరొకరు.. ఇలా వివిధ రకాల వార్తలు హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇవేమీ నిజం కాదని తేలిపోయింది. దిల్ రాజు అండ్ కో కు క్లోజ్ గా ఉండే సోర్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించే ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరి ఎంపిక పూర్తయిందని సమాచారం. పింక్ లో అమితాబ్ బచ్చన్ పాత్రతో పాటు, తాప్సి, మరో ఇద్దరు కథానాయికల పాత్రలు చాలా ముఖ్యం. నిజానికి అమితాబ్ కంటే ఎక్కువ వీళ్ళకే స్క్రీన్ ప్రెజన్స్ ఎక్కువ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో హీరోయిన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అభినయానికి పేరున్న హీరోయిన్లనే సెలక్ట్ చేస్తున్నారు. నివేతా థామస్ ఒక హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అది నిజమేనని తెలుస్తోంది. అయితే అది తాప్సి రోల్ కోసం కాదట. అలాగే మరో హీరోయిన్ గా అంజలిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి మెయిన్ హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పింక్ లో నటించిన తాప్సినే సంప్రదించాలని భావిస్తున్నారు. మరి రీమేక్ పట్ల అనాసక్తిగా ఉండే తాప్సి పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎస్ చెబుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35p8cAg

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...